లోకేష్ రెడ్ బుక్: అడ్డంగా బుక్కయ్యిన నందిగం సురేష్?

FARMANULLA SHAIK
* మాజీ ఎంపీ నందిగంని ఇరకాటంలో పడేసిన ఇసుక కేసు!
* లోకేష్ రెడ్ బుక్ లో బుక్ అయిపోయిన నందిగం!
( బాపట్ల - ఇండియా హెరాల్డ్) : పిన్నెల్లి వివాదం ఎంత పెద్ద అలజడి సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతను అరెస్టయిన కొన్ని రోజుల వ్యవధిలోనే బాపట్ల మాజీ ఎంపీ, వైసీపీ నాయకుడు నందిగం సురేష్ సోదరుడు నందిగం ప్రభుదాస్ ను పోలీసులు అరెస్టు చేయడం జరిగింది.  ఇసుక అక్రమ రవాణా కేసులో పోలీసులు అరెస్టు చేశారు. అయితే దీని వెనుక సురేష్ హస్తం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఉద్దండరాయుని పాలెం వద్ద సోమవారం తెల్లవారు జామున ఇసుక అక్రమంగా తరలిస్తున్న ఓ లారీని పోలీసులు లారీని పట్టుకున్నారు.ఆ లారీ డ్రైవర్ ను అరెస్టు చేసి లారీని సీజ్ చేయగా విచారణలో ఈ ఇసుక అక్రమ రవాణాలో బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ ఇంకా అతని సోదరుడు ప్రభుదాస్ హస్తం ఉందని తెలియడంతో తుల్లూరు పోలీసులు ప్రభుదాస్ ని అదుపులోనికి తీసుకున్నారు.
ఇసుక మాఫియా పై ఆయన్ని ప్రశ్రించారు. ఇలా ఉండగా బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ కూడా తన సోదరుడి అరెస్టు పై ఇంత వరకూ స్పందించలేదు.అయితే ఈ మాఫియా వెనకాలో సురేష్ హస్తం కూడా ఉన్నట్లు తెలుస్తుంది.తెలుగుదేశం కీలక నేత, మంత్రి లోకేష్  రెడ్ బుక్ లో అక్రమార్కుల అందరి పేర్లూ ఉన్నాయి. ఈ లిస్టులో నందిగం సురేష్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో అతనిలో భయం మొదలైంది. టీడీపీ అధికారంలోకి రాగానే విచరణ జరపి చట్టపరంగా శిక్షిస్తామని చెప్పిన సంగతిని గుర్తు చేస్తూ  సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. అయితే తెలుగుదేశం కూటమి ఎవరిపైనా కక్ష సాధింపు పద్ధతిలో చర్యలు తీసుకునే ప్రశక్తే లేదని, అంతా ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతుందని తెలుగుదేశం ప్రభుత్వం చెబుతోంది. ఇప్పుడు నందిగం సురేష్ పక్కా ప్రూఫ్ లతో దొరికాడు కాబట్టి ఖచ్చితంగా అతనిపై కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: