పవన్ కళ్యాణ్ ఎంట్రీ తో.. 9 నెలల తర్వాత వీడిన మిస్టరీ..!

Divya
టాలీవుడ్ హీరో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా వ్యవహరిస్తున్నారు పవన్ కళ్యాణ్.. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజల బాగోగులను సైతం తానే చూసుకుంటానని విధంగా కూడా తెలియజేశారు. ఎవరైనా అత్యాచారాలకు, కిడ్నాప్లకు గురైన కూడా కచ్చితంగా వారి పైన తగు నిర్ణయాలు తీసుకుంటామంటూ తెలియజేశారు. అయితే ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇవ్వడంతో 9 నెలలుగా వీడని ఒక మిస్టరీ కూడా వీటినట్టుగా తెలుస్తోంది. వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం.

అసలు విషయంలోకి వెళ్తే.. ఇటీవలే పవన్ కళ్యాణ్ భీమవరం పట్టణానికి వెళ్లడం జరిగింది.దీంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు భీమవరం పట్టణానికి చెందినటువంటి శివకుమారి తన కూతురు కనిపించడం లేదనే ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ స్వయంగా సిఐతో ఫోన్లో మాట్లాడి రంగంలోకి పోలీసులను సైతం పంపించడం జరిగింది. వాస్తవానికి 9 నెలలుగా అమ్మాయి కనిపించలేదని పోలీస్ కేసు పెట్టినప్పటికీ పోలీసులు విచారణ చేస్తున్న అది ముందుకు సాగడం లేదట.

ఈ విషయం విన్న తల్లిదండ్రులు చాలా కృంగిపోయి పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేయడంతో.. ఈ కేసుని కేవలం కొన్ని గంటలలోనే పోలీసు అధికారులు చేదించినట్లుగా తెలుస్తోంది.అలా మిస్సింగ్ అయిన అమ్మాయి రాయవరప్పాడుకు చెందిన  యువకుడితో ఆమె జమ్ములో ఉన్నట్లుగా గుర్తించారు. దీంతో వెంటనే అధికారులు సైతం ఆ జంటని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయం విన్న వెంటనే అటు కుటుంబ సభ్యుల సైతం ఆనందాన్ని తెలియజేయగా పవన్ కళ్యాణ్ అభిమానులు ,జనసేన కార్యకర్తలు సైతం ఆనందానికి అవధులు లేవు 9 నెలలుగా కానీ పని కేవలం ఒక్క రోజులోనే మా అధినేత చేసి చూపించారనే విధంగా కామెంట్స్ చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో మరి ఎలాంటి మార్పులు వస్తాయో చూడాలి అంటే జనసేన నేతలు కార్యకర్తలు తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: