జగన్ కు బాబు షాక్...హై సెక్యూరిటీ ఏర్పాట్లు తొలగింపు ?
సెక్యూరిటీ లో భాగంగా ఆయన ఇంటికి వెళ్లే మార్గంలో ఏర్పాటు చేసిన... హైడ్రాలిక్ బోలార్డ్స్, టైర్ కిల్లర్స్ ను కూడా తొలగించిన చంద్రబాబు ప్రభుత్వం. ఇక జగన్మోహన్ రెడ్డి ఇంటికి పార్కు విల్లాస్ ద్వారా వెళ్లే మార్గంలో ఉన్న చెక్ పోస్టులను కూడా... కూటమి ప్రభుత్వం తొలగించాలని ఆదేశించడంతో అధికారులు వాటిని తొలగించారు. ఇక అధికారంలో ఉన్న సమయంలో... జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ కోసం దాదాపు 1000 మంది సిబ్బంది ఉన్నారని వార్తలు వచ్చాయి.
కేవలం తాడేపల్లి లో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇంటి చుట్టూ దాదాపు 300 మంది పోలీసులు సెక్యూరిటీ గా ఉండేవారట. అయితే జగన్మోహన్ రెడ్డి పదవి కోల్పోవడంతో.. సెక్యూరిటీ సంఖ్య బలాన్ని కూడా తగ్గించేసింది చంద్రబాబు సర్కార్. ఇది ఇలా ఉండగా... ఇప్పటికే తాడేపల్లి లో వైసీపీ కార్యాలయాన్ని ధ్వంసం చేసింది చంద్రబాబు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వారం రోజుల్లోపే ఈ పని చేపట్టింది. ఇక మరో ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డికి మరిన్ని కష్టాలు వస్తాయి చూడాలి.