ఏపీ: కలవడానికి వచ్చిన అభిమానిని ఫిదా చేసిన బాలయ్య..!

Divya
పొలిటికల్ పరంగా, సినిమాల పరంగా బాలయ్య  గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తాజాగా కర్నూలు జిల్లాలో బాలయ్య నటిస్తున్న 109 వ చిత్రానికి సంబంధించి షూటింగ్ జరుగుతోందట. దీంతో ఒక అభిమాని బాలయ్యను కలవడానికి వచ్చి కలిసి భోజనం చేస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. బాలయ్య సినిమా షూటింగ్ ఓర్వకల్లు రాక్ గార్డెన్ లో జరుగుతోందట. కర్నూలు జిల్లాలోని ఆధోనికి ప్రాంతానికి చెందిన అభిమాని సజ్జద్ అనుమతి తీసుకొని మరి షూటింగ్ గ్యాప్ లో బాలయ్యను కలవడానికి వెళ్లారు.

ఈ క్రమంలోనే అభిమానితో కలిసి బాలయ్య మాట్లాడుతూ ఆ తర్వాత విందును కూడా చేసినట్లు తెలుస్తోంది. ఇక బాలకృష్ణ అభిమాని సజ్జద్ మాట్లాడుతూ.. తను బాలయ్యకు వీర అభిమానిని తనని ఈరోజు కలవడం చాలా ఆనందంగా ఉంది అంటూ తెలియజేశారు.అంతే కాకుండా ఆయనతో కలిసి భోజనం చేయడం కూడా చాలా ఆనందాన్ని కలిగించిందంటూ వెల్లడించారు సజ్జద్.. బాలయ్య తన అభిమానితో కలిసి భోజనం చేస్తున్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానుల సైతం ఫిదా అవుతున్నారు..

వాస్తవానికి బాలకృష్ణకు ఎక్కువగా కోపం ఉంటుందనే విధంగా అందుచేతనే అభిమానులను కొడుతూ ఉంటారని పలు రకాల ప్రచారాలు వినిపిస్తూ ఉంటాయి. అంతేకాకుండా అప్పుడప్పుడు కాస్త ఓవరాక్షన్ చేసిన అభిమానుల మీద కూడా చేయి చేసుకున్న సందర్భాలు ఉన్నాయి.. ఇలాంటి బాలయ్యను మార్చేసింది మాత్రం ఆహా లో ప్రసారమయ్యేటువంటి అన్ స్టాపబుల్ ప్రోగ్రామ్ అని కూడా చెప్పవచ్చు. అప్పుడు బాలయ్య ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే అభిమానులను ధరికి చేసుకొని మరి ముందుకు వెళుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నటువంటి ఈ వీడియోల బాలయ్య అభిమాని తో హిందీలో మాట్లాడుతున్నట్టుగా కనిపిస్తోంది. ముఖ్యంగా చిన్నపిల్లడిగా మారిపోయి పిల్లలతో మాట్లాడుతున్నట్టు కనిపిస్తోంది బాలయ్య.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: