వైసీపీ నేతల రాజకీయం చూసి ఖంగుతిన్న జగనన్న... అరె ఏంట్రా ఇది?
అసలు విషయం ఏమిటంటే ఇప్పుడు ఆ పార్టీలో ఉన్న 164 మందిలో దాదాపుగా 40 – 60 మంది పక్క చూపులు చూస్తున్నట్టు గుసగుసలు వినబడుతున్నాయి. ఏ చిన్న అవకాశం వచ్చినా.. వారు పార్టీ మారిపోవడం ఖాయమని కూడా అంటున్నారు. ఆ అవకాశం దొరకనప్పుడు అవకాశం సృష్టించుకునై నా.. పార్టీ మారేందుకు ప్రయత్నించేలా పన్నాగాలు పన్నుతున్నారని వినికిడి. ముఖ్యంగా వ్యాపారాలు, వ్యవహారాలు నడుపుతున్న వారంతా ఈ జాబితాలోనే ఉన్నట్టు తెలుస్తోంది. కొందరు ఎన్నికలకు ముందు జారుకోగా.. ఇప్పుడు ఓడిన నాయకులు మరింత మంది పార్టీకి టాటా చెప్పనున్నారన్నమాట.
ఇక విశ్లేషకులు ఈ గుసగుసలు వెనుక వాస్తవం లేకపోలేదు అని అంటున్నారు. ఎందుకంటే.. వచ్చే ఐదేళ్ల పాటు వారు వైసీపీలోనే ఉంటే.. ఆర్థిక ఇబ్బందులు అనేవి తప్పవు. మరికొందరు రాజకీయంగా ప్రాధాన్యత చూసుకుంటున్నారు. ఇక్కడ వింత ఏంటంటే.. ప్రస్తుతం వినిపిస్తున్న పేర్లలో చాలా మంది గతంలో ఇతర పార్టీల నుంచి జంప్ చేసి వచ్చిన వారే కావడం కొసమెరుపు. మరి వీరి వ్యూహాలను జగన్ పసిగట్టే ఉంటారు. సో.. ఏం చేస్తారో వేచి చూడాలి. అయితే ఇక్కడ ఎవరెవరు జంప్ జిలానీ అవుతారో తెలియాలంటే ఇంకా కొన్నాళ్ళు వేచి చూడక తప్పదు! మరి ఆ లిస్టులో ఎవరెవరు ఉంటారో మీరు ఊహించగలరా? అలా అయితే ఇక్కడ కామెంట్ చేయండి!