భూములు ఆక్రమించేసిన కొడాలి నాని.. తిరిగి లాగేసుకున్న బాధితులు..??
ఆ 9 ఎకరాల ల్యాండ్కు గతంలో కొడాలి నాని ఫెన్సింగ్ నిర్మించాలని సమాచారం. అయితే ఇప్పుడు బాధితులు రెండు జేసీబీలను తెప్పించి ఆ భూమి చుట్టూ ఉన్న కంచెలను పీకి పక్కన పడేసారని తెలుస్తోంది. అనంతరం ఆ బాధితులు ‘‘కొడాలి నాని అరాచకాలు నశించాలి’’ అంటూ నినాదాలు చేయగా.. ఆ వీడియోలు, ఫోటోలు సర్క్యూలేట్ అవుతున్నాయి. బాధితులుగా చెప్పుకునే వీళ్లు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘పిల్లల భవిష్యత్తు కోసం ఎంతో కష్టపడి కొనుగోలు చేసిన భూమిని కొడాలి నాని, ఆయన అనుచరులతో కలిసి కబ్జా చేశాడు. ఇది అన్యాయమని వాపోతే అక్రమ కేసులు పెట్టి తీవ్రంగా వేధించాడు. మాపై దాడి కూడా చేయించాడు. పోలీసులు, కోర్టు, ప్రభుత్వ అధికారులను ఆశ్రయించాం కానీ మాకు న్యాయం జరగలేదు. వెనిగండ్ల రాము సహాయంతో ఇప్పుడు మేము మా భూమిని తిరిగి తీసుకోగలిగాం." అని చెప్పుకొచ్చారు.
కొడాలి నాని అసలైన 420 అని కూడా వారు ఆరోపించారు. ఆయన రాజకీయాల్లో లేకుండా చేస్తామని అన్నారు. కాగా ప్రస్తుతం ఈ భూకబ్జా వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటా హార్ట్ టాపిక్ గా మారింది. కొడాలి నానిపై ఇంకెన్ని ఆరోపణలు వస్తాయో చూడాలి.