మోడీలో మార్పు: తాజా ఎన్నికల వల్లనేనా ?

Purushottham Vinay
తాజా ఎన్నికల్లో మరోసారి మోడీ గెలిచినా కూడా షాక్ తగిలింది. ఎందుకంటే 400 ప్లస్ సీట్లు పక్కానంటూ ఢంకా బజాయించినట్లుగా ప్రచారం చేసుకొని.. తమకు తాముగా సొంతంగా 370సీట్ల మార్కును అలవోకగా దాటేస్తున్నట్లుగా చెప్పడం జరిగింది. ఏడు దశల్లో సాగిన సార్వత్రికక ఎన్నికల పోలింగ్ మధ్యకు వచ్చేసరికి తమకు కేవలం 200+ సీట్లు వచ్చేశాయంటూ మోడీషాల నోటి నుంచి వ్యాఖ్యల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.తీరా ఈవీఎంలు ఓపెన్ అయి.. ఓట్ల లెక్కింపు తర్వాత కానీ ఓటరు ఇచ్చిన షాక్ తో దేశాన్ని శాసించే అంత పెద్ద మోడీకి సైతం దిమ్మ తిరిగినట్లుగా తెలిసింది. 370 తర్వాత.. ప్రభుత్వాన్ని సొంతంగా ఏర్పాటు చేయటానికి అవసరమైన 300 మార్కును కూడా దాటించకుండా ఉందట చూస్తే ప్రజాస్వామ్యమా? మజాకానా? అని అనుకోకుండా ఉండలేం. దీంతో.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి మిత్రుల సహకారం అవసరమైంది. పేరుకు ఎన్డీయే కూటమి.. అందులో కొన్ని మిత్రపక్షాలు ఉన్నప్పటికీ కూడా గడిచిన పదేళ్లలో ఏ సమయంలో కూడా వాటి అవసరం మోడీకి ఏర్పడలేదు. దీంతో.. వారంతా కూడా అప్రాధాన్యంగా ఉండిపోవడం జరిగింది.అటువంటిది తాజా సార్వత్రిక ఫలితాలతో మోడీలో చాలానే మార్పు వచ్చినట్లుగా చెప్పాలి.

గతానికి భిన్నంగా తాను ఒక్కడినే ఫోకస్ అయ్యే తీరుకు భిన్నంగా.. తనతో పాటు మిత్రపక్షాలను కూడా ఫోకస్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇంకా అంతేకాదు.. భాగస్వామ్య పక్షాలకు కూడా పెద్దపీట వేస్తున్నారు. ఎన్డీయే పక్షాలతో శుక్రవారం నాడు జరిగిన సమావేశాన్ని చూస్తే.. కొత్త మోడీ కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే భాగస్వామ్య పక్షాల గొప్పతనాన్ని ఆయన తన ప్రసంగంలో ప్రస్తావించారు. తాము కలిసి ముందుకు సాగుతామన్న మాట నరేంద్ర మోడీ నోటి నుంచి వచ్చింది. మొత్తానికి గతంతో పోలిస్తే వర్తమానంలో మోడీలో చాలా మార్పనేది కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న పరిస్థితి వచ్చింది.మోడీలో మార్పు ఎంతలా వచ్చిందన్న దానికి నిదర్శనంగా ఒక ఆసక్తికర ఘటన జరిగింది. ఎన్డీయే పక్షాల సమావేశానికి హాజరైన మోడీ .. సదరు హాల్లోకి ప్రవేశ పెట్టిన వెంటనే.. . ఆయన నేరుగా పార్లమెంట్ సెంట్రల్ హాల్లోని రాజ్యాంగ ప్రతిని తన నుదిటికి తాకించుకొని వందనం చేయటం గమనార్హం. అక్కడితో ఆయన ఆ ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్లో కూడా పోస్టు చేసి.. భావోద్వేగ వ్యాఖ్యల్ని ఆ ఫోటోకు జత చేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: