బీజేపీ ఎంపీ కంగనా చెంప పగలగొట్టిన జవాన్ కు బంపరాఫర్?
''చండీగఢ్ ఎయిర్పోర్ట్లో ఏదో జరిగిందని మీడియా ద్వారా నాకు తెలిసింది. కంగనా మొబైల్, పర్సు చెక్ చేసిన సమయంలో ఈ సంఘటన జరిగిందని నాకు అర్థమైంది.మహిళలు వంద తీసుకుని రైతుల నిరసనలో పాల్గొన్నట్లు కంగనా అన్నదానిపై నా సోదరి మానసికంగా చాలా కోపంతో ఉంది. ఇక అదే ఈ సంఘటనకు దారి తీసింది. సైనికులు, రైతులు ఇద్దరూ కూడా ముఖ్యమైనవారు. అన్ని విధాలుగా వారు తమ విధులను నిర్వర్తిస్తున్నారు. ఇక ఈ విషయంలో మేం ఆమెకు పూర్తి మద్దతుగా ఉంటాం'' అని కంగనా రనౌత్ను చెంప పగలగొట్టిన వీర వనిత సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ చర్యను ఆమె సోదరుడు రైతు నాయకుడు, పంజాబ్లోని కపుర్తలా కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ కార్యదర్శి అయిన షేర్ సింగ్ మహివాల్ మెచ్చుకుంటూ తన సోదరికి మద్దతుగా నిలిచాడు.
ఇది ఇలా ఉంటే హిమాచల్ ప్రదేశ్లోని మండి నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీగా గెలిచిన కంగనా చెంప పగల కొట్టిన సీఐఎస్ఎఫ్ మహిళా కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ చర్యను పంజాబ్కు చెందిన ఒక వ్యాపారి కూడా సమర్థించడం జరిగింది. మొహాలీలోని జిరాక్పూర్కు చెందిన బిజినెస్ మ్యాన్ శివరాజ్ సింగ్ బెయిన్స్ ఆమెకు ఏకంగా లక్ష రివార్డు ప్రకటించాడు. పంజాబీ ప్రజలు ఇంకా పంజాబీ సంస్కృతిని రక్షించిన కుల్విందర్ కౌర్కు ఆయన సెల్యూట్ చేశాడు.
ప్రస్తుతం కంగనా చెంపని పగలగొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఆ లేడీ జవాన్ కి నెటిజన్స్ నుంచి స్ట్రాంగ్ సపోర్ట్ లభిస్తుంది.నిన్న చండీఘడ్ విమానాశ్రయంలో బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ను సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కుల్విందర్ కౌర్ చెంపదెబ్బ కొట్టింది. కేంద్రప్రభుత్వ నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గతంలో ఆందోళనలకు దిగిన మహిళా రైతుల గురించి కంగనా అర్ధం పర్ధం లేకుండా చెడుగా మాట్లాడినందుకు ఆ లేడీ జవాన్ ఇలా చెంప పగలగొట్టింది.