పూనమ్ కౌర్: వైయస్ కుటుంబం పై ఆసక్తికరమైన ట్విట్..!

Divya
టాలీవుడ్ లో గతంలో హీరోయిన్గా మంచి పాపులారిటీ సంపాదించుకొని ఎన్నో చిత్రాలలో నటించి మంచి క్రేజీ సంపాదించుకున్న పూనమ్ కౌర్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ముఖ్యంగా ఈమె రాజకీయాలలో చురుకుగా పాల్గొంటూ ఉంటుంది. దీంతో సినిమాలకు దూరంగా ఉన్నది. అంతేకాకుండా ఎప్పుడు త్రివిక్రమ్ పైన చేసేటువంటి ట్వీట్లు తో ఎన్నోసార్లు సెటైర్లు వేస్తూ ఉంటుంది పూనమ్ కౌర్.. తాజాగా ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి రావడంతో పూనమ్ స్పందిస్తూ ఒక విషయాన్ని కూడా ట్విట్టర్ రూపంలో తెలియజేసింది.

ఇప్పుడు తాజాగా వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి సంబంధించి ఒక విషయాన్ని షేర్ చేస్తూ.. మాజీ సీఎం వైయస్ జగన్ కుటుంబం మొత్తం కలిసి మెలిసి ఉండాలని కోరుకుంటున్నానని తెలిపింది. అలాగే గత ఎన్నికలలో జగన్ గారి విజయానికి ఆమె తల్లి విజయమ్మ భార్య భారతి సోదరి షర్మిల కీలకమైన పాత్ర వ్యవహరించారని వారు తమదైన మార్గాలలో సహనం పట్టుదలను నేర్పారని ఇప్పుడు వారంతా కలిసి ఉండాలని కోరుకుంటున్నాను అంటూ ఒక ట్విట్టర్ని షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ట్విట్ కాస్త వైరల్ గా మారడంతో వైసిపి నేతలు ఈమెను ప్రశంశలతో కురిపిస్తున్నారు.

ఈసారి ఎన్నికలలో టిడిపి బిజెపి జనసేన పార్టీ మూకుమ్మడిగా 164 సీట్లను భారీ మెజారిటీతో గెలిచారు. వైసీపీ పార్టీ కేవలం 11 సీట్లకే పరిమితం అవడంతో  వైసీపీ నేతలు ఈ విషయాన్ని సైతం జీర్ణించుకోలేకపోతున్నారు.. అయితే ఏది ఏమైనాప్పటికీ మళ్లీ ప్రజలలో మమేకం అవుతూ కచ్చితంగా తమ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి అడుగులు వేస్తామంటూ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఇటీవల మీడియా ముందు తెలియజేశారు. అంతేకాకుండా నిన్నటి రోజున పలు రకాల సమావేశాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అధికార పార్టీ టిడిపి జనసేన పార్టీలు తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే చేసేటువంటి పనులను చేయకపోతే కచ్చితంగా కూడా ప్రశ్నిస్తామని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: