పుత్రుణ్ణి చూసి పొంగిపోతున్న రేణు దేశాయ్... కారణం ఇదే!

Suma Kallamadi
రేణు దేశాయ్ పేరు వినగానే ఎవరికైనా ముందుగా గుర్తొచ్చేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. బద్రి సినిమాతో మొదలైన వారి జీవితం కొన్నేళ్లపాటు సజీవంగా సాగింది. తరువాత కొన్ని అనివార్య కారణాల వలన వారు విడిపోవడం జరిగింది. ఆ తరువాత ఎవరి పర్సనల్ లైఫ్ లో వారు బిజీ అయిపోయారు. కానీ పవన్ కళ్యాణ్ ఫాన్స్ మాత్రం వారిని ఇప్పటికీ అన్నయ్య, వదినలులానే ఫీల్ అవుతూ ఉంటారు. రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఎటువంటి పోస్టులు పెట్టినా పవన్ ఫాన్స్ రియాక్ట్ అవుతూ ఉంటారు. ఇక రేణు దేశాయ్ కూడా అభిమానులకు తన ఫీలింగ్స్ షేర్ చేస్తూ సోషల్ మీడియాలో అప్పుడప్పుడు టచ్ లో ఉంటుంది.
అసలు విషయంలోకి వెళితే, దాదాపు పదేళ్ల సిదీర్ఘ పోరాటం తర్వాత పవన్ పిఠాపురం ఎమ్మెల్యేగా విజయ దుందుభిని మోగించారు. తాజాగా జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో కూటమి భారీ మెజారిటీతో గెలవడంలో జనసేనాని కీలకపాత్ర వహించారు. ఈ క్రమంలోనే పవన్ తన సక్సెస్ ని కుటుంబంతో ఎంజాయ్ చేసుకుంటున్నాడు. మరీ ముఖ్యంగా పెద్ద కొడుకు అకిరా విషయంలో చాలా బాధ్యతగా వ్యవహరిస్తున్నాడు. ఎన్నికల ఫలితాల రోజు పవన్ ఇంట్లో కనిపించిన అకీరా.. ఆ తర్వాత నాన్నతోపాటు తేదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును కలిశాడు. ఆ తరువాత గురువారం సాయంత్రం ప్రధాని మోదీని కుటుంబసమేతంగా కలిశాడు పవన్ కళ్యాణ్.
భార్య అన్నా లెజేనోవాతో పాటుగా కొడుకు అకీరాతో కలిసి ఎన్డీయే కూటమి నేతల సమావేశానికి పవన్ హాజరైన విషయం విదితమే. ఇక కూటమి నేతల భేటీ ముగిసిన అనంతరం ప్రధాని మోదీకి తన కుటుంబాన్ని పరిచయం చేశాడు పవన్. అదే సమయంలో అకీరా భుజం పై చేయి వేసి పవన్ తో మాట్లాడుతున్నాడు మోదీ. ఇందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ కాగా.. అకీరా మోదీని కలవడంపై రేణూ దేశాయ్ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు. "నాకు ఎప్పటినుంచో బీజేపీ అంటే ఇష్టం. ఈరోజు నా కొడుకు అకీరాను పీఎం నరేంద్రమోదీ గారి పక్కన చూడడం ఎంతో ఆనందంగా ఉంది. దీనిపై నాకు చాలా రాయాలని ఉంది. కానీ మాటలు రావట్లేదు." అని రాసుకొచ్చింది. ప్రస్తుతం దీనికి సంబందించిన పోస్ట్ వైరలవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: