అశ్వని దత్: టీడీపి లో కీలకమైన పదవా..?

Divya
చాలామంది సెలబ్రిటీలు పొలిటికల్ పరంగా మంచి అవినాభావ సంబంధం ఉన్నది. ఆంధ్రప్రదేశ్లో వెలుబడిన ఎన్నికల ఫలితాల అనంతరం టిడిపి పార్టీ మంచి విజయాన్ని అందుకుంది. కనీవిని ఎరుగనీ రీతిలో పెద్ద ఎత్తున విజయాన్ని అందుకున్నారు. ఈ నేపథ్యంలోని టాలీవుడ్ లో చాలామంది సెలబ్రిటీలు సంబరాలు చేసుకుంటున్నారు. పలువురు అగ్ర దర్శకులు కూడా చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలియజేశారు. దీంతో తెలుగుదేశం కూటమి పైన టాలీవుడ్ ప్రస్తుతం హ్యాపీగానే ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.. ముఖ్యంగా టిడిపి తరఫున 2009లో విజయవాడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన అశ్వని దత్ మరింత హ్యాపీగా ఉన్నారు.

అప్పటినుంచి టిడిపి పార్టీకి అనుకూలంగా ఉంటూ 2014 తర్వాత ఆ పార్టీకి దూరమయ్యారు. అయినప్పటికీ కూడా టిడిపి పార్టీకి మద్దతు ఇస్తూనే ఉన్నారు. వైసిపి హయాంలో చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు ఆయన చాలా ఆవేదనను కూడా తెలియజేశారు సోషల్ మీడియాలో కూడా ఎన్నో పోస్టులను పెడుతూ ఉన్నారు. అప్పట్లోనే ఆయన టిడిపి విజయాన్ని అంచనా వేయడం జరిగింది కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో టిడిపి 160 స్థానాలలో గెలుస్తుందని కూడా తెలియజేశారు.

ఇప్పుడు అశ్విని దత్ చెప్పినట్టుగానే టిడిపిలో ఆ సంఖ్య విజయాన్ని దక్కించుకోవడంతో టిడిపి శ్రేణులు ఈయన పైన హర్షాన్ని తెలియజేస్తున్నారు. అశ్విని దత్ కు చంద్రబాబు కానుకగా ఇవ్వాలనుకుంటున్నారని అది కూడా టిడిపి చైర్మన్ పదవి వచ్చే అవకాశం ఉందనే విధంగా ప్రచారం వినిపిస్తోంది. టిడిపి చైర్మన్గా ఉన్న భూమన కరుణాకర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయడంతో ఆ పదవి ఖాళీగా ఉండడంతో డిమాండ్ ఏర్పడింది. ఎంతోమంది నాయకులు ప్రముఖులు కూడా ఈ పదవిని కోరుకుంటూ ఉంటారు. గతంలో సినీ రంగం నుంచి మురళీమోహన్ కూడా ఈ పదవిని కోరుకున్నారు. అయితే ఇప్పుడు అశ్వని దత్ కి టిడిపి చైర్మన్ పదవి దక్కే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చంద్రబాబు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారో చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: