ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చా.. ఆంధ్రాలో అదే జరిగిందా..?

Divya
ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికల ఫలితాలు ఈ నెల నాలుగవ తేదీన విడుదలయ్యాయి.. అయితే ఈ ఫలితాలలో వైసిపి పార్టీ ఘోరంగా ఓడిపోయింది. కానీ ఆంధ్రప్రదేశ్లోని ప్రజలు ఎవరిని అడిగినా కూడా వైసిపి పార్టీకి ఓటు వేశామని చెబుతున్నారు.. ఒకవేళ ఓడిపోయిన కూడా ఒక్కొక్క కాండేట్ 70000 ,80000 ఓట్ల తేడాతో ఓడిపోయారా ఈ విషయాన్ని నమ్మలేకపోతున్నామంటూ తెలియజేస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో రిజల్ట్ ని మాత్రం ఎవరు నమ్మలేకపోతున్నారు. వైసీపీ నాయకుడు రవీంద్రనాథ్ రెడ్డి గారు తమకు ఈవీఎంలు మ్యానుఫ్యాలెట్ జరిగిందని అనుమానం ఉందని కూడా తెలియజేశారు.

అందుకే ఈ విషయం పైన కోర్టుకు వెళ్తామంటూ కూడా తెలియజేశారు. ఈవీఎం మ్యానుఫ్యాలెట్ 100కు 100% జరిగిందని కూడా తెలిపారు. బార్ కంట్రోల్ ను రిమోట్ కంట్రోల్ తో ఏవైనా మ్యానుఫ్యాలెట్ చేశారేమో అన్నట్లుగా తెలిపారు. అయితే ఈవీఎంలు దాచిపెట్టిన స్ట్రాంగ్ రూములో జరిగే అవకాశాలు లేవని.. రిమోట్ గా జరిగాయని అనుమానం ఉందంటూ తెలిపారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్  ఇద్దరు కూడా నరేంద్ర మోడీ నామినేషన్ వేయడానికి వెళ్ళినప్పుడు అటు నుంచి బొంబాయికి వెళ్లారు.. ఆ తర్వాత ఏ దేశానికి వెళ్లారని విషయం తెలియదు.

కొంతమంది అమెరికా అన్నారు మరి కొంతమంది సింగపూర్ వంటి ప్రాంతాలు అన్నారు.. ఇక పవన్ కళ్యాణ్ కూడా మరి కొంతమంది అమెరికా అన్నారు మరి కొంతమంది రష్యాకు వెళ్లారని విధంగా కామెంట్స్ చేశారు. మరి ఈ గ్యాప్ లోనే రిమోట్ గా ఈవీఎంలను మ్యాని ప్లేట్ చేసి ఉంటారా అనే అనుమానం కూడా వినిపిస్తోంది. అసలు ఇది పాజిబులా.. చేయవచ్చా అనే విషయానికి వస్తే.. ఇలా అన్న ప్రతిసారి కూడా ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పిందంటే..
1). ఓటింగ్ మిషన్ కి ఈవీఎం మ్యానుఫ్యాలెట్ కి గాని, హ్యాకింగ్ గానీ జరిగేటువంటి టెక్నాలజీ కాదు.. చాలా స్ట్రాంగ్ టెక్నాలజీ అంటూ తెలిపారు.

2). ఈవీఎంలకు ఇంటర్నెట్ యాక్సెప్ట్ గాని.. ఏమీ ఉండదు. దీనిని హ్యాక్ చేయడం చాలా కష్టమని తెలిపారు. అయితే దీనిలకు ఇంటర్నెట్ ఉంటేనే రిమోట్ కంట్రోల్ వంటివి చేస్తాయి.. కానీ ఇలాంటి వాటిని చేయలేరని తెలుపుతున్నారు.

అయితే లింక్ డెంట్లో ఒక ఆర్టికల్ రాశారు.. రోహిత్ దాల్మియా అనేటువంటి ఒక వ్యక్తి రాశారు. ఈవీఎంలు మ్యానుఫ్లెట్ చేసే అవకాశం ఉందా లేదా అనే విషయం పైన రాశారు.. అతను రాసిన  ఆర్టికల్ ప్రకారం.. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో ఈవీఎంలను ఎలా తారుమారు చేయవచ్చని విషయాన్ని రాశారు. ఈవీఎంలను వివిధ మార్గాలలో మార్చవచ్చని పరిశోధకులు కనుగొన్నారని తెలిపారు. 2011లో యూఎస్ఏ లో మున్సిపల్ మరియు రాష్ట్ర ప్రైమరీ ఎలక్షన్ జరిగేటప్పుడు కొంతమంది నిపుణులు ఈవీఎంలను రిమోట్లతో కంట్రోల్ చేస్తున్నట్లుగా తెలిపారు. అయితే ఎక్కడో కూర్చుని వారి సిస్టంలో కంట్రోల్ చేస్తున్నారట. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే ఇంటర్నెట్ లేకుండా కేబుల్ కనెక్షన్ లేకుండా అక్కడ ఎలా సాధ్యమైంది అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.

అయితే అతను తెలిపిన ప్రకారమే.. అయితే ఈవీఎంల యొక్క తయారీ పద్ధతి ప్రకారం ఇవి హ్యాక్ చేసే అవకాశం ఉంటుందట. మనకు బిహెచ్ఎన్ఎల్ సమస్త ఈవీఎంలను తయారు చేస్తోంది. ఈవీఎం యొక్క మదర్ బోర్డు.. మైక్రో ప్రాసెసర్ నీ, ఈ వైర్లను కనెక్ట్ చేయిస్తే అప్పుడు ఈజీగా హ్యాక్ చేయడానికి ఇదొక మార్గం అని తెలిపారు. అలాగే సాఫ్ట్వేర్ విషయంతో కూడా హ్యాక్ చేయవచ్చట.. ముఖ్యంగా అక్కడ ఎన్నికల తేదీ నీ బట్టి కూడా చేయవచ్చట. అంటే ఇక్కడ మీరు ఒక గుర్తు మీద వేసి ఉంటే మరొక గుర్తుకి అక్కడ పడ్డట్టుగా ఉంటుందట. ఈ విధంగా చేయవచ్చు అంటూ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: