షాక్: అజిత్ ఫ్యాన్స్ కి వార్నింగ్ ఇచ్చిన భార్య.. కారణం..?

Divya
కోలీవుడ్లో స్టార్ హీరో భార్యగా పేరుపొందిన హీరోయిన్ షాలిని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. కోలీవుడ్ ఇండస్ట్రీలో చైల్డ్ యాక్టర్ గా తన కెరీర్ ని మొదలుపెట్టి అతి తక్కువ సమయంలోనే మంచి పాపులారిటీ సంపాదించుకుంది.. ఆ తర్వాత తమిళ తెలుగు కన్నడ ఇండస్ట్రీలలో కూడా నటించిన షాలిని చైల్డ్ యాక్టర్ గా మరింత ఆకట్టుకుంది. హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చే సమయానికి మలయాళంలో బాసిల్ డైరెక్షన్లో హీరో విజయ్ దళపతి సరసన హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకుంది శాలిని.

ఆ తర్వాత అజిత్ సరసన మాధవన్ తదితర హీరోలతో పలు చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకుంది. ఇలా సినిమా షూటింగ్ సమయంలోనే హీరో అజిత్ తో ప్రేమలో పడి వివాహం చేసుకుంది షాలిని. వివాహమైన తర్వాత ఇండస్ట్రీకి దూరమైన షాలిని అప్పుడప్పుడు మాత్రం సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా తన కుటుంబానికి సంబంధించిన అన్ని విషయాలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది. ఈ సందర్భంలో షాలిని పేర్లు దుర్వినియోగం చేస్తూ ఒక వ్యక్తి తన పేరు మీద నకిలీ ట్విట్టర్ ని ఓపెన్ చేసి..80.1k ఫాలోవర్స్ ని చేసుకున్నారు.

ఈ సమాచారం షాలిని దృష్టి వరకు వెళ్లగా.. ఈ విషయం పైన షాలిని వార్నింగ్ ఇస్తూ ఒక పోస్ట్ ని షేర్ చేసింది. తన ఇంస్టాగ్రామ్ పేజీలో ఫేక్ ఎక్స్పోజింగ్ స్క్రీన్ షాట్ ని షేర్ చేసి మరి తన అధికారిక ఎక్స్పోజింగ్ కాదని ఎవరు కూడా వీటిని ఫాలో అవ్వదు అంటూ అభిమానులను సైతం హెచ్చరిస్తోంది. ముఖ్యంగా తన భర్త అజిత్ అభిమానులకు ఈ విషయాన్ని తెలియజేసస్తోంది. దీంతో అజిత్ అభిమానులు ఇన్ని రోజులు మేము ఫాలో అవుతున్నది షాలినేని కాదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఆ పోస్ట్ కాస్త వైరల్ గా మారుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: