ఏపీ : 117 సీట్లతో వైసీపీ విజయం.. టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్..!

Divya
ఆంధ్రప్రదేశ్లోని అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్సభ ఎన్నికల ఫలితాలు రేపటి రోజున వెలుబడునున్నాయి.. ఈసారి ఎన్నికలలో అధికార పార్టీ వైసీపీ గెలుస్తుందని మరొకవైపు కూటమి గెలుస్తుందని దిమాని వ్యక్తం చేస్తున్నారు.. ఎగ్జిట్ పోల్స్ కూడా మరొకవైపు వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తుందనే విధంగా తెలియజేస్తున్నాయి.మరికొన్ని కూటమి దక్కించుకుంటుందంటూ కూడా తెలియజేస్తున్నారు. దీంతో ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు మరింత ఉత్కంఠాన్ని పెంచేస్తున్నాయి. ఇప్పుడు తాజాగా టైమ్స్ నౌ ఈటీజీ సంస్థ నిన్నటి రోజున అధికారికంగా ఎగ్జిట్ పోల్ అంచనాలను తెలియజేసింది.

ఆంధ్రప్రదేశ్లోని వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైసిపి పార్టీ మరొకసారి అధికారంలోకి రాబోతోందంటూ తమ ట్విట్టర్ అకౌంట్ నుంచి ఈ విషయాలను తెలియజేసింది. వైసీపీ పార్టీకి 117 నుంచి 125 స్థానాలు వస్తాయంటూ అంచనా వేసింది.. టిడిపి కూటమికి 50 నుంచి 58 స్థానాలు వస్తాయంటూ తెలియజేసింది.. ఓటింగ్ విషయానికి వస్తే 51%తో వైసిపి పార్టీ ఉందని.. ఎన్డీఏ కూటమికి 47% ఓటింగ్ ఉందంటూ టైమ్స్ నౌ తెలియజేసింది.. ఆంధ్రాలో వైసిపి పార్టీ మెజారిటీ స్థానంలోక్సభ స్థానాలను కూడా గెలుచుకుంటుందని తెలిపారు.


ఏపీలో మొత్తం 25 ఎంపీ స్థానాలకు గాను వైసీపీ 14 అని.. ఆంధ్రప్రదేశ్లో గతంలో ఎన్నికల పోలింగ్ పరిశీలిస్తే ఈసారి 81.66% శాతం వరకు నమోదయిందని మొత్తం మీద 3,33,40,560 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలియజేశారు. గతంలో కంటే ఈసారి ఓటింగ్ కాస్త ఎక్కువగా పెరగడంతో విజయం ఇవ్వలేదని విషయం పైన చాలా ఉత్కంఠత కూడా పెరిగిపోయింది.. మరొకవైపు బెట్టింగ్ రాయల్ కూడా రోజురోజుకి జోరు పెంచేస్తూ ఉన్నారు. అలాగే ముఖ్య నేతల గెలుపోటముల పైన భారీ గాని బెట్టి కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. గడిచిన శనివారం కూడా విడుదలైన ఎగ్జిట్ పోల్స్ కూడా మరింత ఉత్కంఠ తన స్పెండ్ చేస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో రేపటి రోజున చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: