అనకాపల్లిలో రసవత్తర రాజకీయం.. షాకింగ్ సర్వేలు?

Purushottham Vinay
ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఒక్కసారిగా రాజకీయాలని రసవత్తరం చేసేశాయి. ఈ ఫలితాల విడుదల తరువాత ఒక్కసారిగా లెక్కలన్ని మారిపోయాయని కొందరంటుంటే..ఎగ్జిట్ పోల్ ఫలితాలకూ వీటికీ ఏమాత్రం సంబంధం ఉండదని మరికొంతమంది చెబుతున్నారు. ఈ సమయంలో అనకాపల్లి లోక్ సభ సీటుపై ఆసక్తికరమైన చర్చ తెరపైకి వచ్చింది.ఉత్తరాంధ్రలోని అనకాపల్లి లోక్ సభ స్థానంలో రాజకీయంగా ఆసక్తికరమైన చర్చ అనేది జరుగుతుంది. ఇందులో భాగంగా... ఇక్కడ బీజేపీ నుంచి కూటమి అభ్యర్థిగా సీఎం రమేష్ గెలవబోతున్నారని గట్టిగా సమాచారం తెలుస్తుంది. తాజాగా వెలువడిన పలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఈ మేరకు ఈ విషయాన్నే బాగా బలపరుస్తున్నాయని తెలుస్తుంది.అనకాపల్లిలో సీఎం రమేష్ బీజేపీ తరపున పోటీ చేసినప్పటికీ... కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగడంతో ఈ మాజీ టీడీపీ నేతకు స్థానిక టీడీపీ, జనసేన నేతల సహకారం పూర్తిగా దక్కిందని తెలుస్తుంది. దక్కని చోట ఈయన తన 'బలం'తో దక్కించుకోగలిగారనే కామెంట్లు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఇక చివరి నిమిషంలో మెగాస్టార్ చిరంజీవి సపోర్ట్ కూడా బాగానే కలిసొచ్చింది.


నిజానికి అనకాపల్లిలో లోకల్ కేండిడేట్ కే అధిక ప్రిఫరెన్స్ ఉంటుందనే చర్చ ఎన్నికల ముందు బాగా బలంగా వినిపించింది. ఈ సమయంలో జనసేన పార్టీ టిక్కెట్ వదులుకుందనే చర్చ కూడా నడిచింది. అయితే లోకల్ కాదు కదా.. కనీసం పక్క జిల్లా కూడా కాకుండా.. సుమారు పది జిల్లాల అవతల నుంచి వచ్చి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు సీఎం రమేష్. అది కూడా ఆంధ్రాలో ఏ క్రేజ్ లేని బీజేపీ నుంచి కావడం గమనార్హం.అనకాపల్లి టిక్కెట్ కన్ఫాం అని తెలిసినప్పటి నుంచీ సీఎం రమేష్ పూర్తిగా తనదైన చాణక్యాన్ని స్థానికంగా ప్రదర్శించారని తెలుస్తుంది. అక్కడ రూరల్ లో టీడీపీ బాగా బలంగా ఉండటంతో పాటు.. జనసేన జనాలను కూడా బాగా కలుపుకుని ఆయన ముందుకు కదిలారని చెబుతున్నారు. అయితే... అయితే ఈ ఫలితాలు, అంచనాలతో వైసీపీ ఏమాత్రం ఏకీభవించడం లేదు.అనకాపల్లిలో స్థానికుడైన వైసీపీ అభ్యర్థికే జనం పట్టం కడతారని వైసీపీ వర్గం వారు చెబుతున్నారు. అనకాపల్లిలో ఎగ్జిట్ పోల్స్ కి ఎగ్జాట్ ఫలితాలకూ ఏమాత్రం సంబంధం ఉండదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అనేవి కేవలం చూసిన కోణంలో ఇచ్చే అంచనాలు మాత్రమే అని ఈ విషయంలో వైసీపీ మాటలను కూడా కొట్టివేయలేమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: