11 స‌ర్వేల్లో గిర్రున తిరిగిన ఫ్యాను... మ‌ళ్లీ జ‌గ‌నే సీఎం..!

Purushottham Vinay
దేశవ్యాప్తంగా కూడా ఎన్నికల యుద్ధం ముగిసిపోతున్న నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ విడుదల అయ్యాయి. విడుదల అయ్యి బాగా సంచలనం సృష్టిస్తున్నాయి.అయితే గత రెండు వారాల క్రితం ముగిసిన ఎన్నికల తర్వాత రకరకాల సర్వేలు, ఎన్నికల పోలింగ్ సరళి ఇంకా అలాగే ఓటు హక్కు వినియోగించుకొన్న తీరుపై అనేక అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో తమదే గెలుపని పార్టీలు ధీమాతో ఉన్నాయి.ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలపై దేశావ్యాప్తంగా కూడా ఉత్కంఠ నెలకొంది. ఎప్పుడు లేని విధంగా ఈసారి ఏపీలో ఎన్నికలు హోరాహోరిగా జరిగాయి. గెలుపుపై అటు అధికార పార్టీ వైసీపీ నేతలు, ఇటు కూటమి నేతలు బాగా నమ్మకంగా ఉన్నారు.మరోసారి అధికారం మాదే అని వైసీపీ నాయకులు ఇంకా ఈసారి విజయం పక్కా అని కూటమి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎవరి అంచనాలు నిజం కానున్నాయి? అన్నది జూన్ 4న తేలనుంది.

కాగా, అందరి దృష్టి కూడా ప్రస్తుతం ఎగ్జిట్ పోల్స్ పైనే ఉంది. ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఏ విధంగా ఉన్నాయి? ఏ సర్వే సంస్థ ఏం చెబుతోంది? అధికారం ఎవరికి దక్కనుంది? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో ఎగ్జిట్ పోల్స్ రానే వచ్చేశాయి. ఇక సంస్థల వారిగా ఎగ్జిట్ పోల్స్ ఈ విధంగా ఉన్నాయి..2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలను అంచనా వేసే ఎగ్జిట్ పోల్స్ ను సర్వే ఏజెన్సీలు ప్రకటించడం జరిగింది. లోక్ సభతో పాటు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అంచనాలను కూడా వెల్లడించాయి. కొన్ని ఫేమస్ సంస్థల సర్వేల అంచనాలు దాదాపుగా వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి ఈసారి కూడా ఖచ్చితంగా వైసీపీదే గెలుపు అని స్పష్టంగా తెలుస్తుంది.
ఈ 11 స‌ర్వేల్లో కూడా ఫ్యాన్ ఆగకుండా గిర్రున తుఫానులా తిరిగింది...దీన్నీ బట్టి ఆంధ్రప్రదేశ్ కి మ‌ళ్లీ జ‌గ‌నే సీఎం అవ్వడం పక్కా..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: