కేకే సర్వే కూటమి స్వీప్... వైసీపీకి 14 సీట్లే.. టీడీపీకి 133
ఆ ఆరు సీట్లలో పులివెందుల, బద్వేల్, ఎర్రగొండపాలెం, ఆదోని, ఆలూరు, పుంగనూరు, ఉన్నాయి. అంటే జగన్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి వారు మాత్రమే గెలవనున్నారట. మిగతావారు మొత్తం ఓడిపోనున్నారని ఈ సర్వే ప్రకారం తెలుస్తోంది. అరకు, తుని, ఆత్మకూరు, చంద్రగిరి, సర్వేపల్లి, నెల్లూరు, రాయచోటి, నందికొట్కూరు అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ, టీడీపీ మధ్య టఫ్ ఫైట్ ఉంటుందని ఈ సర్వే తెలిపింది.
ఇక ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం వంటి ప్రాంతాల్లో టీడీపీ కూటమి క్లీన్ స్వీప్ చేసిందని, వైసీపీ చాలా చోట్ల డక్ ఔట్ అయ్యిందని ఈ సర్వే వెల్లడించింది. అయితే ఇక్కడ ఈ సర్వే జనసేన గురించి ఒక సంచలన అంచనా వేసింది అదేంటంటే పవన్ కళ్యాణ్ పార్టీ పోటీ చేసిన ప్రతి చోటా అంటే 21 చోట్ల కూడా గెలుస్తుందట. కేకే సర్వే చాలా ఆలోచించే ప్రజాభిప్రాయాలను సేకరించి, ఓటింగ్ సరళిని పరీక్షించి మరీ ఈ సీట్లలో జనసేన గెలవబోతుందని తెలుసుకుని చెబుతున్నదట. పోటీ చేసిన ప్రతి చోట పవన్ కలిస్తే అంటే 100% విజన్ సాధిస్తే ఇక ఆయనే సీఎం అయిపోయిన అయిపోవచ్చు అన్నట్లు కేకే సర్వే వెల్లడించింది. ఇక కూటమిలో భాగమైన బీజేపీ పదిచోట్ల పోటీ చేస్తే ఏడు చోట్ల గెలుస్తుందని కేకే సర్వే తెలిపింది.