పవన్ ఇమేజిని డ్యామేజ్ చేస్తున్న టీడీపీ తమ్ముళ్లు?

Purushottham Vinay
తెలుగు దేశం  తమ్ముళ్లు పవన్ కల్యాణ్ ఇమేజ్‌ను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన కూటమిలో నెంబర్‌-2,  నెంబర్‌- 3 కూడా కాదంటూ కొందరు చేస్తున్న వ్యాఖ్యలు.. సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న ట్రోల్స్, పోస్టుల వల్ల పవన్ కళ్యాణ్ ఇమేజ్ దారుణంగా డ్యామేజ్ అవుతుంది. చంద్రబాబు లేకుంటే పవన్ లేడని చంద్రబాబుకి పవన్ బానిస లాంటి వాడని టీడీపీతో కలవడం వల్ల పవన్ కి పిఠాపురంలో క్రేజ్ వచ్చిందని చాలా మంది టీడీపీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పవన్ ఇమేజ్ ని తగ్గిస్తూ ట్రోల్ చేస్తున్నారు.నిజానికి ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు ముందు కూటమికి అన్నీ తానై పవన్ వ్యవహరించారు. బీజేపీతో టీడీపీని కలిపేందుకు నానా తిప్పలు పడ్డారు పవన్. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పడం జరిగింది.ఆ తర్వాత సీట్ల విషయంలో కూడా పవన్ చాలా మెట్లు కిందికి దిగారు. ముందు 24 సీట్లు అనుకుని కూడా.. ఆ తర్వాత 21కి తగ్గారు. ఇలా పొత్తు దర్మాన్ని పాటించడంలో పవన్ ముందున్నారు.

ఇంకా అంతేకాదు.. ఈ క్రమంలో కీలక నాయకులు పోతిన మహేష్ వంటివారు పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయినా కూడా ఇంకా ముద్రగడ పద్మనాభం వంటి వారు.. తీవ్ర విమర్శలు చేసినా కూడా పవన్ కళ్యాణ్ వాటిని తట్టుకుని ముందుకు సాగారు. ఇక, కూటమి ప్రచారానికి కూడా ఎంతో కష్టపడి ఊపు తెచ్చారు. ముందుండి తనే స్వయంగా ప్రచారం చేశారు. అప్పటి దాకా గెలుపు అంచనాలపై ధీమాతో ఉన్న వైసీపీని ఒక్కసారిగా పవన్ డిఫెన్స్‌లో పడేశారు. ఒకరకంగా చెప్పాలంటే వైసీపీకి ఓటమి భయాన్ని పవన్ చూపించారు. మరోవైపు.. టీడీపీ, జనసేనలోని యూత్‌ను కూడా ఉరకలెత్తించారు. కూటమి నిలబడేందుకు వైసీపీకి గట్టి పోటీ ఇచ్చేందుకు కూడా పవన్ కళ్యాణ్ సహకరించాడు. అలాంటి పవన్‌ను ఇప్పుడు తక్కువ చేసి చూపించేందుకు కూటమిలో ఆయన ప్రభావాన్ని తక్కువ చేసేందుకు  ప్రయత్నాలు గట్టిగా జరుగుతున్నాయి. అయితే ఇలా తక్కువ చేసి ఏం సాదిస్తారు? అనేది ప్రశ్న. కూటమి గెలిచినా.. ఓడినా.. పవన్ కళ్యాణ్ కి మాత్రం ఏమాత్రం క్రేజ్ తగ్గదు. పవన్‌ కళ్యాణ్ ను మైనస్ చేస్తే.. అది కూటమి పార్టీలకే మరింత ఇబ్బందిగా మారుతుందనేది ముమ్మాటికి వాస్తవం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: