పిఠాపురం: జనసేనాని భారీ మెజారిటీతో నెగ్గుతారంటారా?
ఈ సమయంలో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపును కొంతమంది కన్ఫర్మ్ చేస్తే కొంతమంది మాత్రం వంగ గీత గెలుస్తుందని నమ్ముతున్నారు. ముఖ్యంగా పవన్ మెజారిటీ ఎంతనే విషయంపైనే చర్చ, బెట్టింగులు భారీగా నడుస్తున్నట్లుగా ఇండియా హెరాల్డ్ కి సమాచారం తెలుస్తుంది. పైగా.. ఆంధ్రప్రదేశ్ లో కూటమి జతకట్టడానికి కారణం తానే అని చెప్పుకున్న పవన్ కళ్యాణ్ రేపు కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి వస్తే ఏపీ ప్రయోజనాలా విషయంలో ఆయన పాత్ర కీలకమని తెలుస్తుంది.ప్రజల సమస్యలపై పవన్ స్పందించే విషయం కాని ఇంకా ప్రజా సమస్యలను పరిష్కరించాలనే విషయం ఆయన ధోరణి కానీ.. అలాంటి వ్యక్తులు ఖచ్చితంగా అసెంబ్లీలో ఉండాల్సిన అవసరం ఉందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఫలితంగా రాష్ట్రం ముందుకు వెళ్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఫలితంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తారని ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు.అయితే పవన్ కి పోటీగా వైసీపీ గీతని రంగంలోకి దింపడమే కాకుండా డెప్యూటీ సీఎంని చేస్తానని అనడంతో జనాలు వైసీపీ మీద కూడా పాజిటివ్ గా ఉన్నారు. పైగా అక్కడ ఎక్కువ పేదవాళ్లు ఉండటం వలన వైసీపీకి ఓట్లు పడే ఛాన్స్ ఉంది. మరి చూడాలి ఏమవుతుందో..