రాయలసీమ: టిడిపి నేతలను ఏకీపారేస్తున్న రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి..!

Divya
ఆంధ్రప్రదేశ్లోని ఓటింగ్ ప్రక్రియ ఈనెల 13వ తేదీన పూర్తి అయ్యింది. ఓటింగ్ ఫలితాలు మాత్రం వచ్చే నెల నాలుగవ తేదీన జరగబోతున్నాయి. దీంట్లో ఇప్పటికే అటు టిడిపి వైసిపి అధినేతలు నేతలు సైతం తమ పార్టీ అధికారంలోకి వస్తుందంటూ ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఎవరి లెక్కలను వారు చెబుతున్నప్పటికీ కాస్త భయం అయితే కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా చాలామంది నేతలు ఈసారి గెలుస్తామా లేదా అని భయంతో ఉంటున్నారు. తాజాగా రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మీడియా ముందు మాట్లాడుతూ టిడిపి నేతలను ఏకిపారేశారు వాటి గురించి చూద్దాం.

ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ గెలుపు పై ఎన్నికల ఫలితాలు వచ్చే నాలుగవ తేదీ వరకు మాత్రమే టిడిపి వాళ్ళు కలలు కనండి అంటూ ఎద్దేవ చేశారు. అనంతపురం జిల్లాలో 14 గాను వైసీపీ గెలుస్తుందని నమ్మకం మాకు ఉంది అంటూ తెలియజేశారు. అలాగే బాలకృష్ణ కూడా ఓడిపోతారు అంటూ ప్రకాష్ రెడ్డి తెలియజేశారు. టిడిపి నాలుగు సీట్లకే పరిమితం కాబోతోంది అంటూ వెల్లడించారు. చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగానే టిడిపిలో చిన్న చిన్న నాయకులు అంతా కలిసి టీడీపీకి హైప్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారంటూ తెలిపారు.

టిడిపి అభ్యర్థులందరూ వైసీపీ నేతలను తిడుతూ ప్రచారాలు చేస్తున్నారని కూడా వెల్లడించారు. టిడిపి ప్రకటించిన మేనిఫెస్టో వారికే నమ్మకం లేదని కూడా తెలిపారు ప్రకాష్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ జగన్ ప్రభంజనం మరొకసారి కొనసాగుతుందని 164 సీట్లతో తాము అధికారంలోకి వస్తామని కూడా వెల్లడించారు. తమకు నచ్చిన అధికారులను నియమించుకొని కేవలం గొడవలు చేయిస్తున్నారు కూటమి నేతలు అంటూ ఆరోపించారు ప్రకాశ్ రెడ్డి. ఈసారి ఎన్నికలలో పోలీసు వ్యవస్థ చాలా దారుణంగా వ్యవహరించిందని కూడా తెలియజేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి ఈ విషయం రాజకీయాలలో తెగ వైరల్ గా మారుతోంది. మరొకసారి వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తుందంటూ తీర్చే చెప్పారు ప్రకాశ్ రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: