పవన్ మెజార్టీపై రికార్డ్ స్థాయిలో బెట్టింగ్?

Purushottham Vinay
తెలుగు రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికలు ముగిసిపోయాయి. అయితే రాబోయే ఫలితాలపై పందెం రాయుళ్లు రికార్డ్ స్థాయిలో బెట్టింగ్ కాస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో బెట్టింగ్ రాయుళ్ల పందేలు అయితే ఏకంగా కోట్లకు చేరాయని ఇండియా హెరాల్డ్ కి సమాచారం తెలిసింది.ఏ నియోజకవర్గాల్లో ఏ పార్టీ అభ్యర్థి గెలుపుని సొంతం చేసుకుంటారు? గెలిచిన అభ్యర్థికి ఎంత ఆధిక్యం ఉంటుంది? ఆంధ్రప్రదేశ్ లోని కీలక నియోజకవర్గాల్లో అసలు ఏ పార్టీ గెలుస్తోంది? ఎక్కువ సీట్లు ఎవరు గెలుస్తారు? ఏ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధికార పీఠాన్ని సొంతం చేసుకుంటుంది? అన్న అంశాలపై రికార్డ్ స్థాయిలో చాలా జోరుగా పందేలు సాగుతున్నాయి. కార్యకర్తల స్థాయిలో లక్షల్లో పందేలు కాస్తుంటే, నాయకుల స్థాయిలో ఏకంగా కోట్లలో బెట్టింగ్‌ పెడుతున్నారు.ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలో ఎటు చూసినా కూడా ఈ బెట్టింగ్‌ చర్చలే ఎక్కువగా నడుస్తూ హాట్ టాపిక్ గా నిలుస్తున్నాయి. కొంతమంది మహానుభావులు అయితే ఏకంగా తమ విలువైన భూములను బెట్టింగ్‌ల్లో పెట్టడం గమనార్హం.


మంగళగిరి, పిఠాపురం, గుడివాడ, గన్నవరం, ఉండి, ధర్మవరం, కాకినాడ సిటీ, రాజోలు, విజయవాడ తూర్పు, నగరి అసెంబ్లీ నియోజకవర్గాల్లో రికార్డ్ స్థాయిలో ఈ బెట్టింగులు అనేవి సాహసం శ్వాసగా సాగిపో అనే రేంజ్ లో సాగుతున్నాయి.ముఖ్యంగా పిఠాపురం అనేది హాట్ సీట్. ఎందుకంటే ఇక్కడ బాగా పాపులర్ అయిన వ్యక్తి జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు కాబట్టి బెట్టింగ్స్ కూడా ఆ రేంజ్ లోనే ఉన్నాయి. ఇక పిఠాపురంలో పవన్‌ కల్యాణ్‌ 50 వేలకు పైగా మెజారిటీ సాధిస్తారని కాకినాడకు చెందిన ఒక వ్యాపారి ఏకంగా రెండున్నర కోట్ల రూపాయలు దళారి వద్ద ఉంచినట్టు ఇండియా హెరాల్డ్ కి సమాచారం తెలిసింది. ఇక ఉండి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి రఘురామకృష్ణరాజు విజయంపై 1:2 లెక్కన బెట్టింగ్ అనేది సాగుతుండగా కుప్పంలో చంద్రబాబు నాయుడు మెజారిటీ తగ్గుతుందని ఒకరు పందెం పెడితే, గతంలో కంటే పెరుగుతుందని మరికొంతమంది బెట్టింగ్‌ కాస్తున్నారు. ఇక పులివెందులలో సీఎం జగన్‌ మోహన్ రెడ్డి రికార్డు మెజారిటీలపై 1:3 చొప్పున పందేలనేవి సాగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: