జగమంత జగన్: ఉత్త‌రాంధ్ర ఊపేసింది! ఫ్యాన్ గిరాగిరా తిప్పేసింది?

Purushottham Vinay
•జగమంత ఉత్తరాంధ్ర కుటుంబం జగన్ దే
•ఉత్తరాంధ్రని ఊపేసిన ఫ్యాన్
•సైకిల్ ని గిరాగిరా తిప్పేసి కొట్టిన ఫ్యాన్

ఉత్తరాంధ్ర - ఇండియా హెరాల్డ్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ నిన్న ఘనంగా పూర్తయ్యింది. నిన్న మే 13వ తేదీ  ఉదయం 7 గంటలకు ఓటింగ్  మొదలవ్వగా..వేల సంఖ్యలో ఆంధ్ర రాష్ట్ర ఓటర్లు పోలింగ్ బూత్ లకు తరలివచ్చారు. కొన్ని పోలింగ్ బూతుల్లో అయితే ఓటర్ల జాతర మాములుగా లేదనే చెప్పాలి. పోలింగ్ బూతుల వద్ద జనాల తిరనాళ్ల సందడి  ఒక రేంజ్ లో నెలకొంది. పోలింగ్ వద్ద ఎన్నో వందల మంది క్యూలో కనిపించారు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే.. పోలింగ్ బూతుల దగ్గర పురుషులు కంటే స్త్రీలే ఎక్కువగా కనిపించటం మంచి విషయం.అసలు గతంలో  ఎప్పుడూ లేనంతగా నిన్న పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు వేల సంఖ్యలో ఒకేసారి తరలిరావటంతో పెద్ద పెద్ద క్యూలు కనిపించాయి. నిన్న జన జాతరా.. ఓటర్ల జాతరా అన్నట్లు పోలింగ్ బూతుల దగ్గర సందడి వాతావరణం కనిపించింది. ముఖ్యంగా రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో అయితే  ఓటర్ల వాతావరణ పరిస్థితి మెండుగా కనిపించింది.అందులోనూ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా ఓటర్లు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు రావటం కనిపించింది. ఆంధ్రప్రదేశ్ లోని పట్టణాలు, అర్బన్ ఏరియాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లోని ఓటర్లు చాలా ఉత్సాహంగా ఓట్లు వేసి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ముఖ్యంగా ఉత్తరాంధ్రలో అయితే ఓటర్ల సందడి పీక్స్ లో ఉందనే చెప్పాలి.ఉత్తరాంధ్ర లో నిన్న రికార్డ్ స్థాయిలో పోలింగ్ జరిగింది. ముఖ్యంగా వైసీపీకి టీడీపీ కంటే అధికంగా ఓట్లు పోల్ అయ్యాయని అక్కడ ఓట్లు వేసిన జనాల నుంచి ఇండియా హెరాల్డ్ ప్రతినిధులకు సమాచారం తెలిసింది. ఉత్తరాంధ్రలో ఎక్కడ చూసిన ఫ్యాన్ గిరా గిరా తిరగడంతో జగన్ గాలి బాగా వీస్తున్నట్లు సమాచారం తెలిసింది.ఒక్క శ్రీకాకుళంలో టీడీపీ కి ఓట్లు పడగా.. విశాఖ, విజయనగరం వంటి ఏరియాల్లో జనాలు టీడీపీ కూటమి కంటే వైసీపీ వైపే మొగ్గు చూపుతూ ఓట్లు వేసినట్టు సమాచారం తెలిసింది. శ్రీకాకుళంలో కూడా కొన్ని ఏరియాల్లో వైసీపీ కి కూడా బాగా ఓట్లు పడ్డాయి. జగన్ మోహన్ రెడ్డి ఇంకా ఆయన పార్టీ నేతల వాగ్దానాలు గతంలో జనాలకు చేసిన మంచి పనుల వల్ల వైసీపీకి ఉత్తరాంధ్రలో జనాలు బ్రహ్మరథం పడుతూ ఓట్లు వేశారు. ముఖ్యంగా గ్రామీణ ప్రజలు ఫ్యాన్ గుర్తుకి ఓట్లు ఎక్కువ వేశారని సమాచారం తెలిసింది.ఈ ఓట్లతో ఉత్తరాంధ్రాలో ఖచ్చితంగా వైసీపీ టీడీపీ పై ఘన విజయం సాధించడం పక్కా అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: