నాగబాబు: ఓటింగ్ అయిపోగానే బయటపడ్డ వక్రబుద్ధి.. బన్నీపై ఘాటు ట్వీట్..!

Divya
ఆంధ్రప్రదేశ్లోని ఎన్నికలు మెగా ఫ్యామిలీలో మరొకసారి చిచ్చుపెట్టేలా కనిపించాయి. గతంలో కూడా ఈ గొడవలు ఉన్నప్పటికీ అవి చాలా స్పష్టంగా కనిపించలేదు.. ముఖ్యంగా అల్లు వారి కుటుంబానికి మెగా కుటుంబానికి మధ్య పొలిటికల్ గొడవలు మరింత రాజుకుంటున్నాయి. తాజాగా నాగబాబు చేసిన ఒక ట్వీట్ అల్లు అర్జున్ అభిమానులను మరింత రెచగొట్టేలా కనిపిస్తోంది. అల్లు అర్జున్ పేరు ఎత్తకుండా నాగబాబు ఒక ఘాటు ట్వీట్ ను సైతం తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ ట్విట్ కాస్త వైరల్ గా మారుతోంది.

ఈ ట్విట్ లో ఇలా రాసుకోస్తు.."మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడు అయినా పరాయి వాడే.. మాతో నిలబడే వాడు పరాయివాడైన మావాడే.. అంటూ అల్లు అర్జున్ పేరత్తకుండా ఇలా తన పైన ట్వీట్ చేశారని తెలుస్తోంది. నాగబాబు పిఠాపురం అసెంబ్లీ స్థానానికి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న సందర్భంగా మెగా కుటుంబం అందరూ కూడా ఆయనకు అండగా నిలిచేందుకు సహాయపడ్డారు.. చాలామంది పిఠాపురం వెళ్లి కూడా ప్రచారం చేయడం జరిగింది. చిరంజీవి కూడా వీడియోతో తన సందేశాన్ని ఇచ్చారు. రామ్ చరణ్ కూడా చివరిలో పిఠాపురానికి వెళ్లి ప్రచారం చేశారు.

అల్లు అర్జున్ మాత్రం తన స్నేహితుడైన వైసిపి అభ్యర్థి కోసం నంద్యాలకు వెళ్లి రావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. తన స్నేహితుడిని గెలిపించాలని కూడా అల్లు అర్జున్ పిలుపునిచ్చారు. దీంతో అల్లు అర్జున్ వైసీపీ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారని విషయం జన సైనికులకు చాలా కోపాన్ని తెచ్చిపెట్టింది. ఇప్పుడు పోలింగ్ పూర్తి అయిన తర్వాత నాగబాబు వక్రబుద్ధి బయటపడింది.. ఇలా తెలివిగా ట్వీట్ చేశారు. ముందుగానే చేస్తే కచ్చితంగా బన్నీ ఫ్యాన్స్ కి కోపం వస్తుంది దీంతో కూటమికి షాక్ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉందని తెలిసి పోలింగ్ అయిపోయిన వెంటనే ఇలా తన వక్ర బుద్ధితో ఈ ట్విట్ చేశారు నాగబాబు. ప్రస్తుతం మెగా వర్సెస్ మధ్య ఒక వార్ మొదలయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: