ఓటు హక్కును వినియోగించుకున్న స్టార్ హీరో..!

Pulgam Srinivas
ఈరోజు దేశంలో అనేక ప్రాంతాల్లో ఎన్నికలు జరుగుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. హైదరాబాద్ నగరంలో ఓటు హక్కు ఉన్న ఎంతో మంది సెలబ్రిటీలు ఉదయం నుండే తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అందులో భాగంగా ఉదయం నేరుగా దుబాయ్ నుండి హైదరాబాద్ కి వచ్చిన స్టార్ డైరెక్టర్ రాజమౌళి సతి సమేతంగా తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు.

ఇక ఆ తర్వాత పలువురు సినీ ప్రముఖులు కూడా హైదరాబాదులో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇకపోతే హైదరాబాదులో ఓటు హక్కు కలిగినటువంటి సూపర్ స్టార్ మహేష్ బాబు , గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తమ ఓటు హక్కును ఉదయం వినియోగించుకోకపోవడంతో వీరు ఈ ఎలక్షన్లలో తన ఓటు హక్కును వినియోగించుకుంటారా..? లేక వేరే ఏదైనా అత్యవసర పని వల్ల వినియోగించు కోలేకపోతున్నారా అనే ప్రశ్నలు జనాల్లో రేకెత్తాయి.

కానీ ఒక గంట క్రితమే సూపర్ స్టార్ మహేష్ బాబు తన భార్య నమ్రత తో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నాడు. ఇక అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక రామ్ చరణ్ ఒక్కడే మిగిలి ఉన్నాడు అని జనాలు అనుకున్నారు. అంతలోనే రామ్ చరణ్ కూడా సతి సమేతంగా తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. రామ్ చరణ్ మరియు తన భార్య అయినటువంటి ఉపాసన తాజాగా జూబ్లీ క్లబ్ లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఇక మీరు ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత అందరూ బయటికి రండి.. ఓటు హక్కును వినియోగించుకోండి. యువకులు అధికంగా ఓటు వేయాలి.. ఆదర్శంగా నిలవంది అని రామ్ చరణ్ పిలుపునిచ్చాడు. ఇకపోతే రామ్ చరణ్, ఉపాసస ఓటు హక్కును వినియోగించుకున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: