వైసిపి:130 సీట్లతో విజయం ఖాయం..!

Divya
ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సిపి పార్టీ జెండా ఎగరబోతొందని చెప్పవచ్చు.. ముఖ్యంగా ఏపీ సీఎం జగన్ కళ్ళల్లో దీమా వైసీపీ నేతల నమ్మకం చూసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా కూడా వైసిపి జెండా ఎగురుతుందని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదని కూడా చెప్పవచ్చు.. శ్రీకాకుళం నుంచి కర్నూలు వరకు ఏ జిల్లాలో చూసిన ఎక్కువగా జగన్ సభలకు జనం ఏ స్థాయిలో వచ్చారో మనం అర్థం చేసుకోవచ్చు.. మరొక వైపు వైసీపీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల సైతం తమ పార్టీ ఐదేళ్లలో ప్రజలకు చేసిన మంచిని ప్రచారం చేస్తున్నామంటూ ఆ ధీమాతోనే తమ పార్టీ గెలుస్తుందని తెలుపుతున్నారు  వైసిపి నేతలు.

అదే సమయంలో వైసీపీ కనీసం ఈసారి 130 సీట్లతో విజయాన్ని అందుకుంటుందంటూ తెలుపుతున్నారు వైసీపీ నేతలు.. జగన్ పాలనలో సంక్షేమ పథకాల లబ్ధి పొందని కుటుంబాలు అసలు లేవని కూడా తెలుపుతున్నారు.. ఈసారి కచ్చితంగా వైసీపీ జెండా ఎగురుతుందని వైసీపీ అభిమానులు కూడా చాలా ఆనందంతో తెలుపుతున్నారు.. తమ అధినేత జగన్ పడిన కష్టానికి తగ్గట్టుగా ఫలితం దక్కుతుందని కూడా తెలుపుతున్నారు.. చంద్రబాబు ఎన్ని మాటలు చెప్పినా అవన్నీ కూడా గాలి మాటలే అన్నట్లుగా ఫిక్సయ్యారని తెలుస్తోంది.

ముఖ్యంగా వైసిపి పార్టీకి ఉత్తరాంధ్ర ఓటర్లు కూడా మద్దతు ఎక్కువగా ఉందని తెలుపుతున్నారు.. చంద్రబాబును నమ్మి ఇప్పటికే ఎన్నో సందర్భాలలో మోసపోయామని ఏపీ ఓటర్లు అందుకే మరొకసారి తనని నమ్మమంటూ కూడా తెలుపుతున్నారు.. మైనార్టీ ఓట్ల విషయంలో కూడా కూటమికి దెబ్బ పడేలా కనిపిస్తోంది. ఇలా ఒక్కొక్కటిగా వైసిపి పార్టీకి కలిసొస్తూ ఉండడంతో కచ్చితంగా ఈసారి జగన్ పాలిట వరంగా మారనుందని వార్తలు వినిపిస్తున్నాయి.. రేపటి రోజున రెండు తెలుగు రాష్ట్రాలలోని ఎన్నికలు జరగబోతున్నాయి.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు రెండు జరగబోతున్నాయి.. మరి ఏం జరుగుతుందో తెలియాలి అంటే మరో కొద్ది రోజులు ఆగాల్సిందే..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: