కృష్ణా, గుంటూరు 10 సీట్లు రావ‌న్న స్టేజ్ నుంచి 15 సీట్లకు... ఆశ్చ‌ర్యంలో జ‌గ‌న్‌..?

Pulgam Srinivas
మొదటి నుండి కూడా కూటమి అభ్యర్థులు ఒకటి రెండు సీట్లు మినహాయిస్తే కృష్ణ, గుంటూరు జిల్లాలలో క్లీన్ స్వీప్ చేస్తుంది అని భావించింది. ఎందుకు అంటే 2014 వ సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలుగు దేశం పార్టీ అధికారంలోకి రావడం, ఆ తరువాత కృష్ణ, గుంటూరు జిల్లాలకు అతి సమీపంలో రాజధాని ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో అమరావతి నగరాన్ని రాజధానిగా ఎంచుకోవడం, దానిని ఎంతో డెవలప్ చేయడం జరిగింది. ఇక ఆ తర్వాత వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల ప్రస్తావాన్ని తెరపైకి తెచ్చారు.

దానితో అమరావతి ప్రాంతానికి సమీపంలో ఉన్న కృష్ణ, గుంటూరు ప్రజలు అంత వైసీపీ కి రివర్స్ అయ్యారు. ఆ అంశం మాకు ఎంతో కలిసి వస్తుంది అని కూటమి సభ్యులు భావించారు. ఇక వైసీపీ కూడా మొదటి నుండి సీన్ ఇలానే ఉంటుంది అనుకున్నారు. కానీ ప్రస్తుత పరిణామాలు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తున్నాయి. మొదటి నుండి ఈ ప్రాంతంలో ఒకటి, రెండు సీట్లు మాత్రమే వస్తాయి అనుకున్న వైసీపీ కి ఈ ప్రాంతం నుండి దాదాపు 15 సీట్ల వరకు రాబోతున్నట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా గుంటూరులోని బాపట్ల, గుంటూరు పశ్చిమ, మాచర్ల, నరసరావు పేట, పెద్ద కోడూరు ఈ ఐదు అసెంబ్లీ స్థానాలు కూడా వైసీపీ కి గన్ షాట్ గా దక్కే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. గుంటూరు జిల్లా మంగళగిరి నుండి నారా లోకేష్ పోటీ చేస్తున్నారు ఈయన గెలుపు కూడా ఇక్కడ కష్టంగానే కనబడుతుంది. ఇక కృష్ణ జిల్లా విషయానికి వస్తే ఎన్టీఆర్ సొంత ఊరు అయినటువంటి పామర్లలో కూడా కూటమికి భారీ దెబ్బ తగిలి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనితో పాటు నూజివీడు, తిరువూరు, విజయవాడ తూర్పు లో కూడా వైసిపి పార్టీ అభ్యర్థి అవినాష్ భారీ విజయాన్ని అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అలాగే గుడివాడలో కూడా వైసీపీ పార్టీనే జండా ఎగరవేయబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే విజయవాడ ఎంపీ సీట్ కూడా క్రాస్ ఓటింగ్ జరిగే వైసీపీ పార్టీ అభ్యర్థి కేసినేని నాని గెలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా ఒకటి, రెండు సీట్లు మాత్రమే వస్తాయి అనుకున్న కృష్ణ, గుంటూరు జిల్లాల నుండి పెద్ద మొత్తంలో సీట్లు వస్తాయి అని రిపోర్ట్స్ రావడంతో జగన్ కూడా షాక్ అవుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: