వైసీపీకి సపోర్ట్ చేసిన స్టార్ హీరోలు వీరే.. ప్రభాస్ కూడా?
“నేను ముందు కూడా చెప్పాను మన యంగ్ అండ్ డైనమిక్ సీఎం జగన్ గారు. ప్రజల కోసం చాలా కష్టపడుతున్నారు. కానీ నాకు సినిమాల్లో జరిగినట్టే ఆయన ఒక్కడ్ని రాజకీయంగాఎదుర్కోలేక టీడీపీ-బీజేపీ-జేఎస్పీ కలిసి వస్తున్నారు. వాళ్లంతా కలిసి ముసలి వాళ్ల ఇంటి కొచ్చే పింఛన్లు ఆపించడం కరెక్ట్ కాదు. పింఛన్ల కోసం ముసలి వాళ్ళు పడుతున్న కష్టం చాలా బాధాకరం. ఈ కూటమిని నమ్మొద్దు. ప్రజలంతా కచ్చితంగా వైస్సార్సీపీకి ఓటు వేసి గెలిపించండి. ”
“మా నాన్నగారి మరణానంతరం నేను రాజకీయాలకు దూరంగా ఉంటున్నాను కానీ సొంత రాజకీయ లబ్ది కోసం ఆర్ధికంగా వెనకబడి ఉన్న ముస్లిం మైనారిటీల 4% రిజర్వేషన్ తొలగిస్తామంటున్న బీజేపీతో కలిసి ముస్లిం మైనార్టీలకు ద్రోహం చేయటం సరికాదు. దీనివల్ల వైఎస్సార్సీపీ గెలుపు అనేది దాదాపు ఖరారు అయినట్లే.” అని తారక్ అన్నాడు.
"నేను గుంటూరు కారం సినిమా కోసం గుంటూరు మిర్చి రైతులను చాలాసార్లు కలిశాను. వారంతా సంక్షేమ పథకాల వల్ల చాలా ధైర్యంగా వ్యవసాయం చేసుకుంటున్నాం అని చెప్పినప్పుడు చాలా ఆనందపడ్డాను. కానీ రాజకీయంగా ఒక్క వ్యక్తిని ఓడించాలని టీడీపీ వారు బీజేపీతో కలిసి రైతులకు సమయానికి అందాల్సిన సబ్సిడీని ఆపించేసారని తెలిసింది. రైతులకు చాలా అన్యాయం జరుగుతుంది, అందరూ వైఎస్సార్ సీపీకే ఓటు వేయండి. మన రైతన్నలను కాపాడుకోండి.” అని సూపర్ స్టార్ మహేష్ అన్నాడు.