కరీంనగర్ ఎంపీ సీట్ పై స్పెషల్ ఫోకస్ పెట్టిన హరీష్ రావు..!

Pulgam Srinivas
బీఆర్ఎస్ పార్టీలో కీలక సభ్యుడు అయినటువంటి హరీష్ రావు మరికొన్ని రోజుల్లో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తమ పార్టీకి అత్యధిక సీట్లు రావడం కోసం తన వంతు కృషి చేస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా ఈయన కరీంనగర్ సీట్ పై కూడా స్పెషల్ ఫోకస్ పెట్టాడు. ఇక తాజాగా హరీష్ రావు కరీంనగర్ లో ఓ ప్రెస్ మీట్ ను నిర్వహించాడు. అందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై అలాగే బీజేపీ నాయకులపై తనదైన స్థాయిలో హరీష్ రావు విరుచుకుపడ్డారు.

తాజా ప్రెస్ మీట్ లో భాగంగా హరీష్ రావు మాట్లాడుతూ ... విజ్ఞులైన కరీంనగర్ ప్రజలు, మేధావులు, ఉపాధ్యాయులు, విద్యావంతులు ఆలోచించి ఓటు వేయాలి. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన కేసీఆర్ ను గెలిపించాల్సిన బాధ్యత మీపై ఉన్నది. బీసీలపై రేవంత్  ప్రేమ వెయ్యి ఎలకలు తిని తీర్థయాత్రలకు పోయిన పిల్లి తీరులా ఉన్నది. బీసీలకు అత్యధికంగా ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చింది మేం. కులగణనపై అసెంబ్లీలో తీర్మానం చేసింది మేం.

బీసీలకు మంత్రిత్వ శాఖ కావాలని తీర్మానం చేశాం. అదానీని అలాబ్ బలాయ్ చేసుకుని, మోదీని బడే బాయ్ అని పొగిడి బీజేపీతో కుమ్మక్కయింది రేవంత్. ఆజ్ తక్ ప్రోగ్రాంలో బీజేపీకి ఓటు వేయాలని కోరాడు. రేపు నామినేషన్ ఆఖరు అనగా అభ్యర్థులను తేల్చకుండా బీజేపీకి సహకరించాడు. కరీంనగర్లో బీజేపీ గెలుపు కోసం బలహీన అభ్యర్థిని నిలబెట్టాడు. రేవంత్ ఫైటర్ అని బండి సంజయ్, అర్వింద్ పొడుగుతున్నారు.

ఎవరు ఎవరితో కుమ్మక్కయారో ప్రజలకు అర్థమవుతున్నది. కుమ్మక్క రాజకీయాలకు ప్రజలు ఓటుతో చరమగీతం పలకాలి. కరీంనగర్ అభివృద్ధి కోసం పాటుబడిన వినోద్ కుమార్ ను గెలిపించుకోవాలి. ఆయన కేంద్రంతో కొట్లాడి రైల్వే లైన్, స్మార్ట్ సిటీ తెచ్చాడు. కరీంనగర్ అభివృద్ధి కొనసాగాలంటే ప్రశ్నించే గొంతుకైన వినోదన్నను గెలిపించాలి. కేంద్రంలో బీజేపీ ఉన్నా బండి సంజయ్ చేసింది ఏమన్నా ఉందా? మాటలు తప్ప చేతలు శూన్యం. బీజేపీ కార్యకర్తల కష్టసుఖాలు కూడా పట్టించుకోలేదు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కరీంనగర్లో మంచినీళ్లకు బదులు మురికి నీళ్లు వస్తున్నాయి. రేవంత్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. ప్రజలను ఒక్కసారి మోసం చేయగలవు గాని ఎల్లప్పుడూ మోసం చేయలేవు. కేసీఆర్ బస్సు యాత్రతో ప్రజలు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారు అని తాజా ప్రెస్ మీట్ లో భాగంగా హరీష్ రావు చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: