సన్రైజర్స్ కెప్టెన్ కమిన్స్.. ఫేవరెట్ ఇండియన్ ప్లేయర్ ఎవరో తెలుసా?

praveen
గత కొన్నేళ్ల నుంచి ఐపీఎల్ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్రదర్శన చూసిన తర్వాత నిరాశలో మునిగిపోయిన ఆ జట్టు అభిమానులు అందరిలో కూడా ఈ సీజన్లో కొత్త ఉత్సాహాన్ని నింపాడు కమిన్స్. అతను కెప్టెన్సీ చేపట్టిన తర్వాత సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఎంత అద్భుతమైన ప్రదర్శన చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన కెప్టెన్సీ వ్యూహాలతో మాత్రమే కాదు వ్యక్తిగత ప్రదర్శన విషయంలో కూడా కమిన్స్ తనకు తిరుగులేదు అని నిరూపిస్తున్నారు.

 ఒకప్పుడు కేవలం బౌలింగ్ విభాగంతో మాత్రమే నెట్టుకొస్తూ ఉండేది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు. కానీ ఇప్పుడు అటు బ్యాటింగ్లో కూడా వీర విధ్వంసం అంటే ఎలా ఉంటుందో చూపిస్తుంది. ఇక ఐపీఎల్ లోనే మహా మహా టీమ్స్ కి సైతం చెమటలు పట్టిస్తుంది. ప్రతి మ్యాచ్ లో కూడా భారీగా పరుగులు చేస్తూ ఇక  విధ్వంసం సృష్టిస్తూ వరుస విజయాలు సాధిస్తుంది అని చెప్పాలి. సన్రైజర్స్ దూకుడు చూస్తూ ఉంటే తప్పకుండా టైటిల్ గెలిచేలాగే కనిపిస్తూ ఉంది. ఇక ఆ జట్టు ఆట తీరు అభిమానులు అందరిలో కూడా ఆనందాన్ని నింపుతుంది అని చెప్పాలి. దీంతో ప్రతి ఒక్కరు కూడా కెప్టెన్ ఫ్యాట్ కమిన్స్ ఫై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

 ఇకపోతే ఇక సన్రైజర్స్ కెప్టెన్గా వ్యవహరిస్తున్న ప్యాట్ కమిన్స్ కి తన అభిమాన క్రికెటర్ ఎవరు అన్నది మాత్రం ఇటీవల హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇటీవల ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించాడు. స్పోర్ట్స్ ఛానల్ తో మాట్లాడుతూ సచిన్,  ధోని, కోహ్లీలలో ఎవరంటే అభిమానం అంటూ కమిన్స్ కు ప్రశ్న ఎదురయింది. దీనికి బదులిస్తూ ధోని అంటే తనకు ఎంతో ఇష్టమని ఆయనకు పెద్ద అభిమానిని అంటూ సన్రైజర్స్ సారథి బదులిచ్చాడు. తాను ఆరాధించే ప్లేయర్లలో భారత దిగ్గజాలు మిస్టర్ కూల్ ఒకరు అంటూ చెప్పుకొచ్చాడు. ఆల్ టైం గ్రేట్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఆటను చూస్తూ పెరిగాను అంటూ కమిన్స్ కామెంట్ చేశాడు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: