ఏపీ: టీడీపీ పార్టీ ఘన విజయం సాధించే అవకాశం ఉందన్న కొత్త సర్వే...??

Suma Kallamadi
ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో సర్వేలకు బాగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే 10 దాకా సర్వేలు నిర్వహించగా వాటిలో తొమ్మిది వైసీపీ పార్టీని గెలుస్తుందని చెప్పాయి. మరొక సర్వే మాత్రం టీడీపీ టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయని ప్రెడిట్ చేసింది. మళ్లీ ఇప్పుడు టీడీపీ పార్టీ నేతల్లో సంతోషాన్ని కలిగించేలా ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ పార్టీ గెలవడం ఖాయమని ABP సీ-వోటర్ సర్వే అంచనా వేసింది. జాతీయ మీడియా సంస్థ ABP దేశమంతటా సర్వే నిర్వహించి సీ-వోటర్ ఫలితాలను వెల్లడించింది.
2024 లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించే ఛాన్సెస్ ఉన్నాయని ఆ సర్వే వెల్లడించింది. ఈ సర్వే ప్రకారం టీడీపీ కూటమి 20 దాకా ఎంపీ స్థానాలను గెలుచుకుంటుంది. ఇందులో బీజేపీ 5 నుంచి 6 సీట్లు విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలానే కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలిచే అవకాశం లేదని స్పష్టంగా తెలియజేసింది. టీడీపీ కూటమి 46.7% ఓట్లు వైసీపీతో 39.9 శాతం ఓట్లను పొందే అవకాశం ఉందని అభిప్రాయపడింది. కూటమికి వైసీపీకి ఐదు శాతం ఓట్లు తేడా ఉంటుందని వెల్లడించింది.
గత ఎన్నికల్లో వైసీపీకి 22 లోక్ సభ స్థానాల్లో గెలిచింది. ఈసారి నాలుగు నుంచి 5 వంతుల్లో మాత్రమే సీట్లను గెలుచుకునే అవకాశం ఉందట. వైసిపి ఎన్నికల్లో ఓడిపోవడానికి రెండు కారణాలు ఉన్నాయని సర్వే తెలిపింది వాటిలో ఒకటి జగన్ చెల్లెలు షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం, మరొకటి చంద్రబాబును జైలుకు పంపి 53 రోజులు హింసించడం. దీనివల్ల ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడి వైసీపీ ఓడిపోతుందని సర్వే పేర్కొంది. ఏది ఏమైనా ఈ సర్వే చాలా మందికి షాక్ ఇస్తుంది. ఈ సర్వే చెప్పినట్లు వైసిపి ఈ రెండు కారణాలవల్ల ఓడిపోతుందని చెప్పడం మూర్ఖత్వం అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ సర్వే నిజమవుతుందా లేదా అనేది తేలాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: