విశాఖ: బండారు లేకుంటే టీడీపీకి అంత నష్టమా?

Purushottham Vinay
విశాఖ జిల్లాలోని పెందుర్తి వంటి ఎంతో ముఖ్యమైన నియోజకవర్గంలో కూటమిలో సఖ్యత కనిపించడం లేదు. అయితే దీనికి కారణం.. సీటు ఒకరు తీసుకుని టికెట్ మరొకరికి ఇవ్వడమే. ఈ పరిణామమే పెందుర్తిలో రాజకీయాలను బాగా కుదిపేస్తోంది.పొత్తులో బాగంగా ఈ సీటును జనసేన పార్టీ దక్కించుకుంది. ఎందుకంటే.. ఇక్కడ కాపుల ప్రాబల్యానికి తోడు మెగా అభిమానులు అధికంగా ఉన్నారు. దీంతో గతంలో కూడా ప్రజారాజ్యం పార్టీ ఇక్కడ విజయం దక్కించు కుంది. ఈ ఈక్వేషన్‌తోనే జనసేన పార్టీ ఈ టికెట్ కోసం పట్టుబట్టి మరీ దక్కించుకుంది. అయితే.. ఇదే సీటును టీడీపీ నేత.. బండారు సత్యనారాయణ మూర్తి కూడా ఆశించడం జరిగింది. ఇంకా అంతేకాదు నారా లోకేష్ ప్రజాగళం పాదయాత్రలో చెప్పినట్టు.. ఈయన వైసీపీ పై దుమ్మెత్తి పోశారు.సీటుని కూటమిలో భాగంగా జనసేనకు కేటాయించాక  బండారుకు ఏకంగా బీపీ డౌన్ అయిపోయి.. ఆసుపత్రిలో కూడా చేరిపోయారు. కట్ చేస్తే.. జనసేన తీసుకున్న ఈ సీటులో వైసీపీ నుంచి వచ్చిన పంచకర్ల రమేష్ బాబుకు ఛాన్స్ ఇచ్చారు. ఈయన గతంలో టీడీపీలో ఉన్న నేత.


కానీ, బండారుకు ఇంకా పంచకర్లకు మధ్య రాజకీయ వివాదాలు ఉన్నాయి.ఇక బండారు సుముఖత వ్యక్తం చేయలేదు.పార్టీ కోసం ఎంతో చేశానని.. ఎన్నో కేసులు కూడా పెట్టించుకున్నానని బండారు చెబుతున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం బండారుకు అనుకూలంగా పరిస్థితి అనేది లేదు. మరోవైపు..చంద్రబాబు నాయుడు కూడా ఆయన విన్నపాన్ని తిరస్కరించి.. కలిసి పనిచేసి పంచకర్ల గెలుపునకు కృషి చేయాలని అన్నారు.అసలే టికెట్ రాక ఏడుస్తుంటే.. తన ప్రత్యర్థి.. వైసీపీ నుంచి వచ్చి తన టికెట్ లాగేసుకున్న వ్యక్తికి ఎలా పనిచేయాలన్నది బండారు మండిపడుతున్నారు. దీంతో బండారు సైలెంట్ అయ్యారు. అయితే.. ఇక్కడే చంద్రబాబు నాయుడు మంత్రాంగం పనిచేసింది. బండారును వ్యతిరేకించే వర్గాన్ని బాబు లైన్‌లో పెట్టారు. దీంతో గండి బాబ్జీని టీడీపీ ప్రచారంలోకి పంపించారు. దీంతో బండారు లేకపోయినా కానీ ప్రచారం జరుగుతోంది. కానీ, బండారుకు అనుకూలంగా ఏకంగా 20 వేల ఓట్లు అయితే ఉన్నాయనేది వాస్తవం. బండారుకి టీడీపీ అనుకూలంగా లేకపోవడం వల్ల ఖచ్చితంగా అన్ని వేల ఓట్లు పార్టీ నష్టపోవడం ఖాయమని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: