విశాఖ: అనకాపల్లిలో సీఎం రమేష్ గెలుపు తథ్యం?

Purushottham Vinay
•రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేకంగా నిలుస్తున్న అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గం
•అనకాపల్లిలో దీటైన అభ్యర్థిగా దూసుకుపోతున్న సీఎం రమేష్
•సీఎం రమేష్ కి గట్టి పోటీ ఇవ్వలేకపోతున్న వైసీపీ 

విశాఖ: అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గం రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేకంగా ఉంటుంది. ఆ స్థానం నుంచి పోటీ చేయాలని తెలుగుదేశం నుంచి కనీసం ముగ్గురు కీలక నేతలు అనుకున్నారు. జనసేన పార్టీ నుంచి పవన్ అన్న నాగబాబు దాదాపుగా ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. చివరికి ఆ స్థానం నుంచి ఎవరూ ఊహించని విధంగా సీఎం రమేష్ పోటీలో నుంచున్నారు. ఇక ఆయనకు అపోనెంట్ గా వైసీపీ బూడి ముత్యాలనాయుడుని నిలబెట్టింది. ఆయన సీఎం రమేష్ కు సరైన ప్రత్యర్థేనా కాదా అన్న సంగతి పక్కన పెడితే వైసీపీ తన లెక్కలన్నీ పక్కన పెట్టేసిందని అర్థమవుతోంది. బీజేపీకి సహకరించేందుకే ఇలా చేసిందన్న ప్రచారం నియోజకవర్గంలో వినిపిస్తుంది.అనకాపల్లి లోక్‌సభ నియోజకవర్గం 1962 వ సంవత్సరంలో ఏర్పడింది. తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత ఆ పార్టీనే ఎక్కువగా ఐదుసార్లు గెలిచింది. అనకాపల్లి పార్లమెంట్‌ పరిధిలో.. కాపు, గవర, కొప్పుల వెలమ సామాజికవర్గాల ఓట్లే అధికంగా ఉంటాయి. ఈ మూడు సామాజిక వర్గాల ఓట్లే దాదాపు 70 శాతంగా ఉన్నట్లు తెలుస్తుంది. అందుకే అనకాపల్లిలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా, ఈ మూడు కులాల వారినే అభ్యర్థులుగా పెడుతుంటారు. 

నాన్ లోకల్ అయినా కానీ వెలమ వర్గానికి చెందిన సీఎం రమేశ్‌ సామాజికవర్గం అండ ఉంటుందన్న ఉద్దేశంతో పోటీకి రెడీ అయ్యారు. ఈ స్థానంలో వైసీపీ కాపు లేదా గవరకు అవకాశం ఇచ్చి ఉంటే ముందే అడ్వాంటేజ్ వచ్చి ఉండేదన్న అభిప్రాయం కూడా ఉంది. కానీ కొప్పుల వెలమ వర్గానికే చెందిన బూడి ముత్యాలనాయుడుకు టిక్కెట్ ని ఇచ్చారు.ఇప్పుడు పొత్తు కారణంగా కాపు, గవరల ఓట్లు చీలిపోయే ఛాన్స్ లేదు. వైసీపీ అభ్యర్థి కూడా ఈ వర్గాలకు చెందిన వ్యక్తి కాకపోవడంతో ఓట్లనేవి చీలవు.నిజానికి డిప్యూటీ సీఎం ముత్యాలనాయుడు ఈ సారి కూడా మాడుగుల ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి మొదట నిర్ణయించింది వైసీపీ.కానీ ఆర్థికంగా బలమైన నేత సీఎం రమేశ్‌ను ఢీకొట్టాలంటే సామాజిక కోణంతోపాటు స్థానిక నినాదం కూడా ఉపయోగపడుతుందని భావించిన వైసీపీ.. బూడి ముత్యాలనాయుడిని మొదటిసారిగా ఎంపీ బరిలోకి దింపింది. ఆయనకు ఇష్టం లేకపోయినా కానీ ఆయన కుమార్తెకే మాడుగల టిక్కెట్ ఇచ్చి ఒప్పించింది.

గత ఐదేళ్లలో ఆయన పనితీరుపై వ్యతిరేకత, పక్క నియోజకవర్గ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీతో విభేదాలు, సొంత కుమారుడితోనూ వివాదం వంటివి ఆయన ఇమేజ్ ను డ్యామేజ్ చేసాయి. మాడుగుల నియోజకవర్గానికి ప్రధాన రహదారి నిర్మించుకోలేకపోవడంపై జనాల్లో అసంతృప్తి ఉది. కూటమి తరఫున బీజేపీ నేత సీఎం రమేశ్‌ పోటీ చేస్తుండటంతో రాష్ట్రంలో ప్రముఖ నేతలంతా కూడా అనకాపల్లి ఫలితంపై చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ఇండియా హెరాల్డ్ కి సమాచారం తెలిసింది. రాష్ట్ర, జాతీయస్థాయిలో కీలక నేతగా ఎదిగిన సీఎం రమేశ్‌ మొదటిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో బరిలోకి దిగుతున్నారు. తన రాజకీయ ప్రస్థానాన్ని తెలుగుదేశం నుంచి ప్రారంభించిన సీఎం రమేశ్‌.. గత ఎన్నికల తర్వాత బీజేపీలో చేరారు.

ఇప్పుడు టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి యొక్క ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.నాన్ లోకల్ పేరుతో ఎక్కువ ప్రచారం చేసేందుకు వైసీపీ చాలా గట్టిగా ప్రయత్నిస్తోంది. కానీ లోక్ సభ ఎన్నికలు మాత్రమే జరుగుతూంటే ఈ అంశం ప్రచారంలోకి వెళ్లేదే కానీ ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు మాత్రమే బాగా హైలెట్ అవుతున్నాయి. సీఎం రమేష్ .. రాజకీయం ఎలా చేయాలో తెలిసిన రాజకీయ నేత. తాను వేధింపులకు అండగా ఉంటానని.. ఒకటి,రెండు ఘటనలతోనే నిరూపించడం జరిగింది. వ్యాపార వర్గాలను బాగా ఆకట్టుకున్నారు. బీజేపీ పెద్దల్ని నొప్పించకుండా ఉండేందుకు అనకాపల్లి లో వైసీపీ తీవ్రమైన ప్రయత్నాలు కూడా చేయడం లేదు.అందువల్ల వైసీపీ ప్రయత్న లోపం స్పష్టంగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: