జనసేనానిపై మావో నేత తీవ్ర విమర్శలు?

Purushottham Vinay
జనసేనాని పవన్ కళ్యాణ్ మాట్లాడితే తాను చెగువెరా స్పూర్తిని తీసుకున్నానని తనకు కమ్యూనిస్టు భావజాలం ఇష్టమని చెబుతూ వచ్చారు. అయితే ఈమధ్య కాలంలో ఆయన ఆ పదజాలాన్ని వాడడం లేదు.దానికి కారణం బీజేపీతో మితృత్వమని తెలుస్తుంది. ఆ పార్టీతో కలసి ఎన్నికల్లో పోటీ చేయడమే కాదు సుదీర్ఘకాలం మోడీ అధికారంలో ఉండాలని పవన్ కళ్యాణ్ గట్టిగా కోరుకుంటున్నారు.ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ 2014 నుంచి 2024 మధ్యలో చాలా పార్టీలతో స్నేహం చేశారు.2014లో టీడీపీ బీజేపీ ఆ తరువాత 2019 వచ్చేనాటికి ఉభయ వామపక్షాలు, బీఎస్పీ వంటి వాటితో ఎన్నికల లోకి దిగారు. 2020 నుంచి బీజేపీతో పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ 2023లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. ఈ 2024 ఎన్నికల కోసం మూడు పార్టీలూ కూడా కలిసి కూటమి కట్టాయి.ఇక ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ రాజకీయ విధానాల మీద ప్రత్యర్ధులు ఎప్పుడు కూడా విమర్శలు చేస్తూ ఉంటారు. ఆయన అన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకుంటున్నారని కూడా విమర్శిస్తూ ఉంటారు. కానీ మొదటి సారిగా పవన్ కళ్యాణ్ మీద మావోయిస్టులు విమర్శలు చేశారు. అది కూడా తీవ్ర స్థాయిలో చేశారు.తాజాగా  పవన్ కల్యాణ్ పై మావోయిస్టు అగ్రనేత గణేశ్ లేఖని విడుదల చేశారు.


పవన్ కళ్యాణ్ పై ఈ లేఖలో ఆయన తీవ్ర విమర్శలు చేశారు. పార్టీ స్థాపించిన రోజు తమ పార్టీ కమ్యూనిస్టు భావజాలం గల పార్టీ అని,నేడు బీజేపీతో పొత్తు పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని ఆయన అన్నారు. పవన్ కళ్యాణ్‌కు స్థిరమైన రాజకీయ విధానం లేదని అన్నారు.పవన్ కళ్యాణ్ కు విశ్వసనీయత లేదంటూ హాట్ కామెంట్స్ చేయడం విశేషం. ఇంకా అంతే కాదు రాజకీయ నేతగా చూస్తే కనుక పవన్ కల్యాణ్ కు విశ్వసనీయత చాలా తక్కువని గణేశ్ తాను రాసిన లేఖలో కోరడం జరిగింది. సినీ గ్లామర్, కాపు కులస్థుల గుర్తింపుతో రాజకీయ నిరుద్యోగులకు జనసేన పార్టీ ఒక వేదికగా మారిందని మావోయిస్టు గణేష్ తాను రాసిన లేఖ లో పేర్కొన్నారు.మొత్తం మీద ఈ లేఖ పవన్ కళ్యాణ్ కి పెద్ద షాక్ గా మారింది. ఆయన చాలా సందర్భాల్లో మాట్లాడుతూ తాను ఒకదశలో మావోయిస్టులలో కూడా కలసి పనిచేయాలనుకున్నానని అన్నారు. మరి కమ్యూనిస్టు భావజాలం పట్ల మావోల పట్ల పవన్ కళ్యాణ్ సానుభూతిగా ఉంటే మావోల వైపు నుంచి మాత్రం ఆయనకు ఘాటు లేఖలు వస్తున్నాయి. దీనికి జనసేనాని ఎలా రియాక్ట్ అవుతాడో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: