పవన్ తీరుపై టీడీపీ నేతల ఆగ్రహం?

Purushottham Vinay
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో రాజకీయ వేడి అనేది తారాస్థాయికి చేరింది. ఓ వైపు అధికార పార్టీ అయిన వైసీపీ ఇంకా మరోవైపు కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ దూకుడు పెంచాయి.మరీ ముఖ్యంగా కొన్ని సీట్ల విషయంలో కూటమిలోని పార్టీల నేతల మధ్య సమన్వయం అనేది దెబ్బతిన్నది. ఈ పొత్తులో భాగంగా పిఠాపురం సీటు జనసేన పార్టీకి ప్రకటించగానే టీడీపీ కార్యకర్తలు ఎంతగానో ఆగ్రహం వ్యక్తంచేశారు. వర్మ అనుచరులు టీడీపీ కార్యాలయానికి వెళ్లి ఫ్లెక్సీలు ఇంకా జెండాలు తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. వర్మకే టీడీపీ టికెట్ ని ఇవ్వాలని  వారు డిమాండ్‌ చేశారు. అయితే చంద్రబాబు నాయుడు వర్మను పిలిచి బుజ్జగించారు. ఇక ఎమ్మెల్సీ హామీ ఇవ్వడంతో ఈ గొడవ సద్దుమణిగింది.అంతా సద్ధుమణిగింది అనుకునే లోపు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. జనసేన పార్టీ తరపున కాకినాడ ఎంపీ అభ్యర్థిగా ఉదయ్‌ని ప్రకటించారు పవన్ కళ్యాణ్. ప్రధాని మోదీ ఇంకా అమిత్ షా సూచనతో ఒకవేళ తాను ఎంపీగా బరిలోకి దిగితే మాత్రం.. పిఠాపురం అసెంబ్లీ నుంచి ఉదయ్ పోటీ చేస్తారని పవన్ ఉన్నారు. ఇద్దరం స్థానాలు మార్చుకుంటామని చెప్పడం మరోసారి వేడెక్కేలా చేసింది.


ఈ కామెంట్స్ టీడీపీలో ఆశలు పెంచేలా చేశాయి. పొత్తులో భాగంగా సీటు త్యాగం చేశానన్న ఎస్వీఎస్ఎన్ వర్మ.. పవన్ కళ్యాణ్ కనుక పోటీ చేయకపోతే తాను బరిలో ఉంటానన్నారు. పవన్ కళ్యాణ్ బరిలో నిలిస్తే రక్తం ధారపోసైనా గెలిపించుకుంటాం.. కానీ వేరే వాళ్ల పల్లకీలు మోయడానికి మాత్రం మేం సిద్ధంగా లేమన్నారు.వర్మ కామెంట్లు జనసేన పార్టీ కేడర్‌ను అయోమయంలో పడేశాయి. పొత్తులో భాగంగా పిఠాపురంను జనసేన పార్టీకి కేటాయించాక.. మళ్లీ టీడీపీ ఎలా పోటీకి వస్తుందని వారు ప్రశ్నిస్తున్నారు. సీటు పాట్ల సంగతి పక్కనపెడితే.. పిఠాపురం సెగ్మెంట్‌ చుట్టూ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయం నడుస్తోంది. నిన్న పవన్ కళ్యాణ్ సమక్షంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు.కొద్ది నెలల నుంచి జనసేనకు దూరంగా ఉంటోన్న శేషుకుమారిని వ్యూహాత్మకంగా పార్టీలో చేర్చుకుంది వైసీపీ. శేషు కుమారి గత ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా పిఠాపురం బరిలో నిలిచారు. అయితే ఉదయ్‌ని ఇన్‌ఛార్జ్‌గా నియమించాక పార్టీ కార్యక్రమాలకుచాలా దూరంగా ఉంటూ వస్తున్నారామె. ఇక ఈ క్రమంలోనే వంగా గీత.. శేషుకుమారిని వెంటబెట్టుకుని తాడేపల్లికి తీసుకెళ్లారు.సీఎం జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు శేషుకుమారి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: