ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. అన్ని పార్టీలు కూడా ప్రచారాలు మొదలు పెట్టాయి.ఏ పార్టీ గెలుస్తుందో అన్న చర్చ ఎక్కువయ్యింది.వైసీపీ మేనిఫెస్టో ప్రకటన అనేది వాయిదా పడింది. ఈనెల 20 వ తేదీన మేనిఫెస్టో ప్రకటించాలని భావించినా కూడా ఎన్నికల షెడ్యూల్ విడుదలతో వ్యూహం మార్చుకుంది వైసీపీ. వైసీపీ మేనిఫెస్టోపై కసరత్తు తుది దశకు చేరుకుంది.2019 మేనిఫెస్టోను 99శాతం అమలు చేశామంటున్న వైసీపీ 2024 ఎన్నికల మేనిఫెస్టోను రెడీ చేస్తోంది. జగన్ చెప్పాడంటే చేస్తాడంతే నినాదంతో మేనిఫెస్టో డిజైన్ చేస్తోంది. ఈసారి కూడా రైతులు, కార్మికులు, మహిళలు, యువత ఇంకా విద్యార్ధుల సంక్షేమానికే పెద్దపీట వేస్తారని వైసీపీ వర్గాలు తెలిపాయి.వైసీపీ రీజినల్ కోఆర్డినేటర్లతో సమావేశమైన పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి మేనిఫెస్టోతోపాటు ప్రచార రూట్మ్యాప్పై చర్చించారు. బూత్ కమిటీల ఎంపిక, పోల్ మేనేజ్మెంట్ ఇంకా ఎన్నికల వ్యూహాలపైనా ఫోకస్ చేశారు.
వైసీపీ మేనిఫెస్టో డిజైన్ ఇప్పటికే తుది దశకు చేరుకుందని సమాచారం తెలుస్తుంది. సిద్ధం సభల వేదికగా ప్రకటన ఉంటుందని ప్రచారం జరిగినా కూడా వాయిదా పడింది. త్వరలోనే పార్టీ కేంద్ర కార్యాలయం వేదికగా మేనిఫెస్టో ప్రకటన ఉంటుందని సమాచారం తెలుస్తోంది.గతంలో కంటే ప్రతి విషయంలో కూడా ఎక్కువ లబ్ధి కలిగించేలా మేనిఫెస్టో వుంటుందని వైసీపీ నేతలు చెబుతున్నారు. గత ఎన్నికల ముందు నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలపై ఫోకస్ పెట్టిన వైసీపీ ఈసారి మేనిఫెస్టోలో నవరత్నాలకు అప్గ్రేడెడ్ వెర్షన్గా ఉండొచ్చని తెలుస్తోంది. ఈసారి పేదలతో పాటు మధ్యతరగతి వర్గాలకు లబ్ధి చేకూర్చే పథకాలతో మేనిఫెస్టో వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.ఇంకా అలాగే.. మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన హామీలు కూడా ఉంటాయని సమాచారం తెలుస్తుంది. జగన్ చెప్పాడంటే చేస్తాడనే నమ్మకం జనాల్లో ఉండటంతో వైసీపీ మేనిఫెస్టోపై రాష్ట్ర ప్రజల్లో ఎంతో ఆసక్తి ఏర్పడిందంటున్నారు ఆ పార్టీ నేతలు.