నెల్లూరు: ఫుల్ జోష్ లో ఉన్న టిడిపి శ్రేణులు?

Purushottham Vinay
పోయిన ఎన్నికల్లో వైసీపీ తరపున వెంకటగిరి నుంచి గెలిచిన ఎమ్మెల్యే ఆనం రామానారాయణరెడ్డి.. సొంత ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తూ వార్తల్లో నిలిచేవారు.సంవత్సరం క్రితం ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో బరస్ట్ అయ్యారు. దీంతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌ చేశారనే ఆరోపణలతో సస్పెన్షన్‌కి కూడా గురయ్యారు ఆనం.కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డితో పాటు ఆనం కూడా అప్పుడు తెలుగుదేశం పార్టీకి దగ్గరయ్యారు.అప్పటి నుంచి టీడీపీ కార్యక్రమాలు ఇంకా అలాగే లోకేష్ ప్రోగ్రామ్స్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటూ మళ్లీ వెంకటగిరి టికెట్ ఆశించారు. తెలుగుదేశం పార్టీ మొదటి లిస్ట్‌లోనే తన పేరు ఉంటుందని ఆశించారు. అయితే కోటంరెడ్డికి సీటు కన్ఫామ్ అయింది కానీ.. ఆనం పేరు మాత్రం ప్రకటించలేదు. దీనికి కారణం ఆనంకి నియోజకవర్గం కన్ఫర్మ్ కాకపోవడమే. 2009 వ సంవత్సరంలో ఆత్మకూరు నుంచే ఆనం రామనారాయణరెడ్డి ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత కొన్ని రాజకీయ సమీకరణాల్లో భాగంగా వెంకటగిరికి ఆయన మారారు.



ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత కూడా అదే సీటు ఆశించారాయన.అయితే తెలుగుదేశం అధిష్టానం మాత్రం ఆనం అవసరం ఆత్మకూరులో ఎక్కువగా ఉందని భావించి.. అక్కడికే వెళ్లాలని సూచించింది. ఆత్మకూరుకు వెళ్లని పక్షంలో సర్వేపల్లికి పంపిస్తే ఎలా ఉంటుందనే దానిపై తెలుగుదేశం పార్టీ సర్వే కూడా చేయించింది. కానీ చివరకు ఆత్మకూరు అయితేనే కరెక్ట్ అని తెలుగుదేశం పార్టీ భావించింది. దీనిపై మొదట్లో ఎలాంటి నిర్ణయం తీసుకోని ఆనం.. ఇప్పుడు మనసు మార్చుకుని ఆ పోటీకి అంగీకరించారు.అయితే ఆత్మకూరులో పోటీకి ఆనం ఒప్పుకోవడానికి ఇంకో బలమైన కారణం కూడా ఉందట. ఆ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఆర్ధికంగా బలమైన నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తున్న కారణంగా.. ఆత్మకూరులో అండగా ఉంటారనే భరోసాతోనే పోటీకి రెడీ అయ్యారు.సీనియర్ పొలిటీషియన్ అయిన ఆనం.. సంతృప్తి చెందడంతో.. నెల్లూరులో టీడీపీ శ్రేణులు ఫుల్ జోష్‌లో ఉన్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: