రంగంలోకి నేరుగా దిగిన విజయసాయిరెడ్డి?
ఇలాంటి తరుణంలో ఎవరూ ఊహించని విధంగా సీఎం వైఎస్ జగన్ నెల్లూరు లోక్ సభ ఇన్ ఛార్జిగా విజయసాయి రెడ్డిని ప్రకటించారు. ఇది ఆయన సొంత జిల్లా. ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనడం ఇదే తొలిసారి. మరో వైపు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి దాదాపు ఖరారు అయినట్లే. ఈ ఇద్దరూ రాజ్యసభ సభ్యులే. ఇద్దరూ నెల్లూరు జిల్లాలో బలమైన నేతలే. పైగా ఆర్థికంగా బలవంతులు. ఒకరి బలాలు-బలహీనతలపై మరొకరకి స్పష్టత ఉంది. వేమిరెడ్డి ఆర్థికంగా బలమైన అభ్యర్థి కావడంతో విజయ సాయి రెడ్డిని దింపాలని జగన్ డిసైడ్ అయ్యారు.
అయితే ఎంపీ అభ్యర్థిగా విజయ సాయి ని ప్రకటించడంతో ఆయన నెల్లూరు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పుట్టి పెరిగిన గడ్డపై పోటీ చేసి గెలిచి ప్రజలకు సేవ చేస్తాను. వేమిరెడ్డి నాకు మంచి మిత్రుడు, రాజకీయం వేరు, స్నేహం వేరు అని అన్నారు. మరోవైపు జిల్లాపై తనకు సంపూర్ణ అవగాహన ఉందన్నారు. పార్టీకి, ప్రజలకు నిరంతంర అందుబాటులో ఉంటాను అని వ్యాఖ్యానించారు.