ఏపీలో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.ఇక ఈ క్రమంలో అభ్యర్థుల ఎంపికలో అధికార పార్టీ కీలక నిర్ణయాలు తీసుకుంటున్న నేపథ్యంలో నరసాపురం లోక్ సభ స్థానం విషయంలో సీటు.. కేంద్ర మాజీ మంత్రి, రెబల్ స్టార్ కృష్ణంరాజు ఫ్యామిలీ కోసం అట్టిపెట్టారని అంటున్నారు. ఈ సమయంలో కృష్ణం రాజు గారి భార్య శ్యామలా దేవి స్పందించారు.ఏపీలో ఎన్నికలు వస్తున్నాయి. ఈ సమయంలో అభ్యర్థుల ఎంపికలో చాలా రకాల పరిణామాలను పరిగణలోకి తీసుకుంటున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మూడు లోక్ సభ స్థానాల్లోని అభ్యర్థుల ఎంపికలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని అంటున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే గుంటూరు నుంచి సినీనటుడు అలీకి ఛాన్స్ ఉండొచ్చని కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే.ఇక ఇదే సమయంలో... రాజమండ్రి లోక్ సభ స్థానం నుంచి టాలీవుడ్ డైరెక్టర్ వీవీ వినాయక్ పోటీ చేసే అవకాశాలున్నాయని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇంకా మరోపక్క గతకొన్ని రోజులుగా నరసాపురం వైసీపీ లోక్ సభ అభ్యర్థిగా శ్యామలా దేవి గారు పోటీచేసే అవకాశం ఉందని సోషల్ మీడియాలో చర్చ విపరీతంగా జరుగుతుంది.
పైగా ఇప్పుడు ఆమె పశ్చిమగోదావరి జిల్లాకు రావడం అలాగే మీడియాతో ఈ వార్తలపై అస్పష్టంగా స్పందించడంతో ఈ చర్చ మరింత ఊపందుకుంది.దివంగత నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు సతీమణి, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి గారు వెస్ట్ గోదావరిలో ఉన్నారు. కృష్ణంరాజు జయంతి సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో భారీ ఎత్తున మెడికల్ క్యాంపుని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మీడియా ఆమె వద్ద రాజకీయ రంగప్రవేశం గురించి.. వైసీపీ నుంచి ఎంపీగా పోటీచేసే విషయం గురించీ ప్రస్థావించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె చెప్పిన సమాధానం ఇప్పుడు చాలా ఆసక్తిగా మారింది.వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీచేసే విషయంపై స్పందించిన శ్యామలా దేవి "తాను కృష్ణంరాజు గారి దాతృత్వ కోరికలను నెరవేర్చడానికి వచ్చాను. ఈ కార్యక్రమం పూర్తయ్యాక రాజకీయ ప్రవేశంపై మీరు అడిగే ప్రశ్నలకు కచ్చితంగా క్లారిటీ ఇస్తాను.." అని అన్నారు. అందువల్ల శ్యామలాదేవి రాజకీయ రంగప్రవేశంపై ఊహాగాణాలు ఇప్పుడు మరింత జోరందుకున్నాయి.