చైనా: ఉక్కిరిబిక్కిరవుతున్న డ్రాగన్ రాజ్యం?

Purushottham Vinay
అగ్ర రాజ్యాలలో ఒకటైన చైనా దేశంలో మరోసారి కల్లోలం మొదలైంది.చైనా తన కొన్ని నగరాల్లో లాక్‌డౌన్ విధించేందుకు సిద్ధమవుతోంది. ఎందుకంటే చైనాలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ ఫ్లూ కేసులు మాత్రం చాలా వేగంగా పెరుగుతున్నాయి.ఈ కారణం వలన చైనా అధికారులు కొన్ని నగరాల్లో లాక్‌డౌన్ విధించాలని నిర్ణయించారు. దీంతో ఇక చైనా ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇలా చేయడం వల్ల కరోనా మహమ్మారి కాలంలో పరిస్థితి ఏర్పడుతుందని ఎంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.చైనా దేశంలో గత కొన్ని రోజుల నుంచి కొత్త వైరస్‌ విస్తరిస్తున్నట్లు గుర్తించారు. ఇవి ఎక్కువ ట్రాన్స్‌మిసిబిలిటీతో అత్యంత వేగంగా వ్యాపించే అంటు వ్యాధిగా అక్కడి వైద్యులు చెబుతున్నారు.అందువల్ల గత కొద్దిరోజుల నుంచి చైనాలో కేసులు చాలా విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో లాక్‌డౌన్‌ విధించడంతో పాటు ప్రయాణాల విషయంలో కూడా కొన్ని పరిమితులు అమలు చేయాలని చైనా అధికారులు భావిస్తున్నారు.చైనా నగరమైన జియాన్‌లో లాక్‌డౌన్‌కు సంబంధించి అత్యవసర ప్రతిస్థితులను సంబంధించి కీలక ఆదేశాలని జారీ చేయడం జరిగింది. నగరంలో వైరస్ సోకిన ప్రాంతాలను మూసివేయాలని కూడా పేర్కొంది.


ట్రాఫిక్‌ను తగ్గించేందుకు అనేక ఆదేశాలు కూడా జారీ చేయనున్నారు. ఉత్పత్తి ఇంకా అలాగే వ్యాపార కార్యకలాపాలు కూడా నిలిపివేయాలని వారు సూచించారు. షాపింగ్ మాల్స్, థియేటర్లు, లైబ్రరీలు, పర్యాటక ప్రదేశాలు ఇంకా అలాగే ఇతర రద్దీ ప్రదేశాలు కూడా మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.ఎమర్జెన్సీ రెస్పాన్స్ ప్లాన్ ప్రకారం.. స్కూల్స్ , నర్సరీలు అన్ని స్థాయిలలో మూసివేయాలని కూడా అధికారులు ఆదేశించారు జియాన్‌లో దాదాపు 13 మిలియన్ల జనాలు ఉన్నారు. అంతేగాక ఈ నగరం ప్రసిద్ధ పర్యాటక కేంద్రం కూడా. లాక్‌డౌన్ వార్తలకు సంబంధించి ప్రజలు సోషల్ మీడియాలో నగర పాలక సంస్థపై విమర్శలు కూడా చేస్తున్నారు. లాక్‌డౌన్ విధించే బదులు ప్రజలకు టీకాలు ఇవ్వండి అంటూ ప్రజలు కోరుతున్నారు. ఇక ఇదిలా వుంటే జాతీయ స్థాయిలో ఎలాంటి స్పష్టమైన ఆదేశాలు లేకుండా.. వ్యాపార వాణిజ్య కార్యకలాపాలను నిలిపివేయాలని జియాన్ ఒక తీర్మానాన్ని జారీ చేయాలని ప్లాన్ చేస్తుంది.అటు చైనాలో ఫ్లూ కేసుల పెరుగుదలతో పాటు ఇంకా అలాగే కొన్ని ఫార్మసీలలో మందుల కొరత కూడా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: