ఈ -శ్రమ్ కార్డు బెనిఫిట్స్ కొల్పొవద్దు..రూ.2 లక్షలు భీమా పొందవచ్చు..

Satvika
ప్రధాన మంత్రి మోడీ ప్రభుత్వం ప్రజల శ్రేయస్సు కోసం ఎన్నో పథకాలను అందుబాటులోకి తీసుకొని వచ్చింది.అందులో ఒకటి  ఈ-శ్రమ్ కార్డ్ యోజన..దేశంలో అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులను ఏకతాటిపైకి తీసుకురావడానికి కేంద్రప్రభుత్వం ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకొని వచ్చింది.ఈ పథకం కింద కార్మికులకు ఆర్థిక సహాయం అందిస్తుంది . కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసిన ఈ -శ్రమ్ పోర్టల్‌లో ఇప్పటివరకు 28.42 కోట్ల మంది నమోదు చేసుకున్నారు . 



ఇందులో ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 8.2 కోట్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. తర్వాతి స్థానాల్లో బీహార్, పశ్చిమ బెంగాల్, ఎంపీ, ఒడిశా ఉన్నాయి.ఈ పథకం కింద ఆర్థిక సహాయంతో పాటు రూ. 2 లక్షల ప్రమాద బీమా ప్రయోజనం ఇస్తుంది. దేశంలోని చిరువ్యాపారులు, కూరగాయలు అమ్మేవారు, ఇంటి పనివారు, అలాగే చిన్న-చిన్న-సమయం పని చేసే యువకులందరూ ఈ-శ్రమ్ కార్డ్ యోజన ప్రయోజనాన్ని పొందవచ్చు. మరోవైపు ఎవరైనా పన్ను చెల్లిస్తే లేదా వ్యాపారవేత్త అయితే అతనికి దీని ప్రయోజనం ఉండదు..



ఈ-లేబర్ పోర్టల్‌లో నమోదు చేసుకున్న కొద్ది రోజుల తర్వాత కూలీలు, కార్మికులకి ఈ లేబర్‌ కార్డు తయారవుతుంది. ఈ పోర్టల్ కింద దేశంలోని కార్మికులందరినీ ఒకే ప్లాట్‌ఫారమ్‌పై అనుసంధానం చేస్తున్నారు. ఈ కారణంగా భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం ఏదైనా పథకాన్ని ప్రారంభిస్తే అది ఈ పోర్టల్ సహాయంతో అందరు కార్మికులకు ప్రయోజనాలను అందిస్తుంది. ప్రస్తుతం ఇందులో నమోదు చేసుకున్న వారికి రూ.2 లక్షల ప్రమాద బీమా ఇస్తున్నారు.



అయితే,ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, ఆదాయ ధృవీకరణ పత్రం, బ్యాంక్ పాస్‌బుక్ వంటి పత్రాలు అవసరం..ఈ కార్డును పొందడానికి ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి. ముందుగా ఈ-లేబర్ పోర్టల్‌కి వెళ్లి రిజిస్టర్ ఆన్ ఈ-లేబర్ ఎంపికపై క్లిక్ చేయండి. తర్వాత మొబైల్ నంబర్, OTPని ఎంటర్‌ చేయండి. తర్వాత ఈ-లేబర్ కార్డ్ ఫారమ్‌ను నింపి సమర్పించండి. తర్వాత రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేస్తారు.అంతే కార్డును పొందవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: