"జనసేన"ను పవన్ కళ్యాణ్ బీజేపీలో విలీనం చేస్తాడా ?
అయితే వీరిద్దరూ లోపల దేని గురించి చర్చించుకున్నారు అన్నది బయటకు అయితే రాలేదు కానీ... మీడియా మిత్రులు మరియు రాజకీయ విశ్లేషకులు ఎవరికి నచ్చిన విధంగా వారు మాట్లాడుకుంటున్నారు. మోదీతో మీటింగ్ అనంతరం పవన్ మీడియా ముందు మాట్లాడిన తీరును బట్టి ఎవరికి తోచింది వారు రాసుకుంటున్నారు. ముఖ్యంగా రెండే రెండు విషయాలు హాట్ టాపిక్ గా నిలిచాయి. మోదీ పవన్ ను రెండే అంశాలను అడిగి ఉంటారని అందరూ ఊహిస్తున్నారు. మోదీ పవన్ ను ఇలా అడిగి ఉంటారని అంచనా ... జనసేనను బీజేపీలో విలీనం చేస్తావా ? లేదా 2024 ఎన్నికల్లో ఏపీలో మాతో కలిసి నడుస్తావా ? అయితే ఈ రెండు ప్రశ్నలకు కూడా సమాధానం దాదాపుగా ఒక్కటే ... కానీ ఇప్పటికే పవన్ చంద్రబాబు తో కలిసి ఎన్నికలకు వెళ్ళడానికి ప్లాన్ చేసుకుని ఉన్నారు.
మరి ఇటువంటి సమయంలో పవన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడు అన్నదానిపైనే జనసేన భవిష్యత్తు ఆధారపడి అది అని పలువురు అభిప్రాయపడుతున్నారు. మోదీ ఇలాంటి ప్రశ్నలు అడగడానికి కారణం ఇటీవల పవన్ ప్రవర్తించిన విధానమే అని చెప్పాలి. మీడియా సమావేశాలలో పార్టీ అధ్యక్షుడిగా ఉండి "చెప్పు" చూపించి మాట్లాడడం మరియు ఇప్పటం గ్రామం విజిట్ లో కారు మీద కూర్చుని హీరోలా ప్రవర్తించడం లాంటివి మోదీ దగ్గర లాక్ చేశాయి అని చెప్పాలి. పవన్ మోదీ అడిగిన విధంగా జనసేనను బీజేపీలో విలీనం చేస్తాడా ?