'జగనన్న తోడు' కింద వడ్డీ లేని రుణాలు!

Purushottham Vinay
'జగనన్న తోడు' పథకం కింద వడ్డీ లేని రుణాలను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమచేశారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. మొత్తం 3.95 లక్షల మందికి ఈ పథకం ద్వారా కొత్తగా రూ.395 కోట్ల వడ్డీ లేని రుణాలను సమకూర్చడంతోపాటు ఇంకా గత ఆర్నెల్లకు సంబంధించి రూ.15.96 కోట్ల వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ను కూడా ఆయన జమ చేశారు.ఈ సందర్భంగా సీఎం జగన్‌ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. చిరు వ్యాపారులకు ఇంకా హస్త కళాకారులకు రూ. 10వేల చొప్పున వడ్డీలేని రుణాల పథకం అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఇక వరుసగా ఐదోసారి ఈ పథకం కింద డబ్బులు అందజేశాం..అలాగే కొత్తగా సుమారు 4 లక్షల మందికి రుణాలు ఇచ్చామని.. మొత్తం రూ. 395 కోట్ల వడ్డీలేని రుణాలతో పాటు.. గత ఆరునెలలకు సంబంధించి సకాలంలో రుణాలు చెల్లించిన వారికి మొత్తం రూ.15.96 కోట్ల వడ్డీని కూడా జమ చేశాం.. ఇప్పటి వరకూ కూడా ఈ పథకం కింద 15,03,558 లక్షల మందికి రూ.2,011 కోట్ల వడ్డీలేని రుణాలు అందాయని.. ఈ రుణాలు చెల్లించిన 12.50 లక్షల లబ్ధిదారులకు ప్రభుత్వం తిరిగి చెల్లించిన వడ్డీ మొత్తం రూ. 48.48 కోట్లుగా ఉందని తెలిపారు.ఈ స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ వారికి అండగా నిలుస్తున్నామని తెలిపారు సీఎం వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి..


తమకు తాము ఉపాధిని ఇవ్వడమే కాకుండా మరి కొంత మందికి ఇక ఏదో రూపంలో ఉపాధిని ఇస్తున్నారు.. వీరు చేసేది వ్యాపారం అనే దాని కన్నా.. ఇంకా గొప్ప సేవ అనడంలో ఏమాత్రం సంకోచించాల్సిన అవసరంలేదన్నారు. ఇలాంటి చిరు వ్యాపారులతోపాటు సంప్రదాయ చేతివృత్తులవారికీ ఇస్తున్నాం ఇంకా వడ్డీ వ్యాపారుల మీద ఆధారపడకుండా, అధిక వడ్డీల భారాన్ని మోసే అవసరం అనేది లేకుండా వీరికి తోడుగా నిలుస్తున్నామని తెలిపారు. వెయ్యి రూపాయలకు రూ.100లు రోజు వడ్డీగా కట్టాల్సిన పరిస్థితులు గురించి నాకు పాదయాత్రలో చెప్పారు.. ఇక నడ్డి విరిచే వడ్డీల భారాన్ని తప్పించి వీరికి అండగా నిలవడానికి ఈ పథకాన్ని వర్తింపు చేస్తున్నామని.. దేశ వ్యాప్తంగా మొత్తం 34 లక్షలమంది వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, బ్యాంకులద్వారా తోడ్పాటు పొందితే..ఇక అందులో దాదాపు సగంమందికి మన రాష్ట్రంలోనే రుణాలు పొందుతున్నారని.. దీనికి సహకరించిన ప్రతి బ్యాంకుకూ కూడా మనస్ఫూర్తిగా కృజ్ఞతలు చెబుతున్నట్టు వెల్లడించారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: