ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈనెల 15న విశాఖ జిల్లాలో ఇరవై వేల మంది లబ్దిదారులు వాహన మిత్ర పథకంలో లబ్ధి పొందుతున్నారని రాష్ట్ర పరిశ్రమలూ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెళ్లడించడం జరిగింది.అలాగే రాష్ట్రంలో మొత్తం 2.61 లక్షల మందికి కూడా రూ.261 కోట్ల రూపాయలను వాహన మిత్ర పథకంగా పంపిణీ చేస్తున్నారని రాష్ట్ర పరిశ్రమల ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీ- ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో 15వ తేదీన జరగనున్న ముఖ్యమంత్రి సభ ఏర్పాట్లను మంత్రి అమర్నాథ్ సోమవారం నాడు పరిశీలించడం జరిగింది. ఈ సభ ఏర్పాట్లు- వివరాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ. మల్లికార్జునను అడిగి వారు తెలుసుకున్నారు. అనంతరం మంత్రి అమర్నాథ్ మీడియాతో మాట్లాడటం జరిగింది. ఇక ఆయన మాట్లాడుతూ ఇప్పటికే మూడు విడతలుగా వాహన మిత్ర లబ్ధిదారులకు సుమారు 750 కోట్ల రూపాయలు అందజేశామని ఆయన చెప్పారు.ఇంకా అలాగే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలు చూసి ప్రతిపక్షాల నవ రంద్రాలు మూసుకుపోయాయని అని మంత్రి అమర్నాథ్ ఎద్దేవా చేశారు.
ఒక రాజకీయ పార్టీ నిర్వహించిన ప్లీనరీకి ఇంత పెద్ద ఎత్తున జనం వస్తారని అసలు ఎవ్వరు కూడా ఊహించ లేదని ఆయన అన్నారు. ఇంకా చంద్రబాబు నాయుడు టీ-డీపీని ఆక్రమించుకున్న తర్వాత 27 సంవత్సరాలలో ఇంత పెద్ద సభ ఎప్పుడైనా చూశారా అని కూడా ఆయన ప్రశ్నించారు. అలాగే గుంటూరు జిల్లాలో నిర్వహించిన ప్లీనరీ కి హాజరైన జనంతో 20 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయిందని అయినా కూడా సభకు స్పందన లేదని టిడిపి నాయకులు విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మంత్రి అమర్ నాథ్ వెంట మేయర్ గొలగాని హరి వెంకట కుమారి, ఎమ్ ఎల్ సి వరుదు కళ్యాణి, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ శీతంరాజు సుధాకర్ ఇంకా అలాగే వి ఎమ్ ఆర్ డీ యే చైర్ పర్సన్ అక్కరమాని విజయనిర్మల తదితరులు కూడా ఉన్నారు.