ఊరంతా పోస్టర్లు.. మ్యాటర్ ఏంటా అని చూస్తే షాక్?

praveen
ఇటీవలి కాలంలో యువత కొన్ని కొన్ని విషయాలలో తీసుకుంటున్న నిర్ణయాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఒకప్పటి పెళ్ళిళ్ళతో  పోల్చి చూస్తే ఇప్పటి పెళ్లిళ్లు కాస్త విచిత్రంగానే జరుగుతున్నాయ్ అని చెప్పాలి. ఒకప్పుడు అయితే బంధువులు ఇచ్చిన సమాచారం మేరకు వధువు ఇంటికి వరుడు కుటుంబ సభ్యులు వెళ్లడం ఆ తర్వాత వధువు కుటుంబ సభ్యులు వరుడు ఇంటికి వచ్చి బాగోగులు తెలుసుకోవడం లాంటివి చేసేవారు. ఇక ఆ తర్వాత ఇరు కుటుంబాల ఒప్పందంతో ఘనంగా పెళ్లి జరిపేవారు అన్న విషయం తెలిసిందే.
 కానీ నేటి రోజుల్లో పెళ్లిళ్లు మాత్రం కేవలం ఆన్లైన్ మయం అయిపోయాయి. పెళ్లి చూపుల కోసం ఎక్కడికో వెళ్లాల్సిన పనిలేదు.  అర చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లో మ్యాట్రిమోనీ సైట్ ఓపెన్ చేస్తే చాలు ఎంతో మంది అబ్బాయిల ఫోటోలు, డీటెయిల్స్, జాబ్, బ్యాంకు బాలన్స్ ఇలా అన్ని రకాల వివరాలు కూడా తెలిసిపో తున్నాయి. దీంతో అమ్మాయిలు అబ్బాయిలు  తమకు నచ్చిన వారిని ఎంపిక చేసుకునేందుకు అవకాశం ఉంది. ఇలాంటి ట్రెండ్ నడుస్తున్న సమయంలో కొంతమంది మాత్రం ఇంకా పెళ్లి కోసం సరికొత్తగా ఆలోచిస్తూ  ఉన్నారు.

 ఇటీవలే ఓ యువతి ఏకంగా గోడ పత్రికలను అతికించి వరుడు కావాలంటూ ప్రకటన చేసింది. ఇప్పుడు తమిళనాడులోని మధురైలో ఒక యువకుడు ఇలాంటిదే చేశాడు.  వీధులలో పోస్టర్లు అతికించడం వధువు కావాలంటూ ప్రకటన చేశాడు. 27ఏళ్ల జగన్ ప్రైవేట్ కంపెనీ లో మేనేజర్ గా పని చేస్తున్నాడు. అయితే తన పేరు, కులం, జీతం, వృత్తి, కాంటాక్ట్ నెంబర్ అడ్రస్ వివరాలు అన్నింటినీ కూడా పోస్టర్లో వెల్లడించాడు. ఐదేళ్లుగా భాగస్వామి కోసం వెతుకుతున్నాను అంటూ చెప్పాడు. అయితే గతంలో డిజైనర్గా పని చేయడం వల్ల ఈ సరికొత్త ఆలోచన రావడంతో ఆచరణలో పెట్టాను అంటూ చెప్పుకొచ్చాడు యువకుడు .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: