తెలంగాణ హైకోర్టుకు గుడ్ న్యూస్..?
ఈ కొత్త న్యాయమూర్తుల్లో న్యాయవాదుల విభాగం జాబితాలో కాసోజు సురేందర్, సూరేపల్లి నంద, ముమ్మినేని సుధీర్కుమార్, జువ్వాడి శ్రీదేవి, ఎన్.శ్రావణ్ కుమార్ వెంకట్ ల పేర్లు ఉన్నాయి. అలాగే న్యాయాధికారుల విభాగం జాబితాలో గున్ను అనుపమా చక్రవర్తి, మాటూరి గిరిజా ప్రియదర్శిని, సాంబశివరావు నాయుడు, ఏనుగు సంతోష్రెడ్డి, దేవరాజ్ నాగార్జున్ల పేర్లు ఉన్నాయి. ఈ పది మందిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా నియమిస్తున్నట్లు కేంద్ర న్యాయశాఖ కూడా మంగళవారం రాత్రే ఆదేశాలు జారీ చేసేసింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 217(1)కింద వచ్చిన అధికారాల ప్రకారం వీరి నిమాయకాలకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. ఉత్తర్వుల్లో పేర్కొన్న క్రమంలోనే ఈ కొత్త జడ్జిలకు సీనియారిటీ వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వీరు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వారి నియామకం అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కొత్తగా నియమితులైన ఈ పది మంది న్యాయమూర్తులు రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్చంద్ర శర్మ ఈ పది మందితో రేపు ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఈ కొత్తగా పది మంది నియామకాలతో తెలంగాణ హైకోర్టులో జడ్జిల సంఖ్య 29కు చేరనుంది. తెలంగాణ హైకోర్టులో మొత్తం 42 మంది న్యాయమూర్తులు ఉండాలి. అంటే మరో 13 ఖాళీలు ఉన్నాయన్నమాట.