ఉక్రెయిన్: మోదీ సంచలన నిర్ణయం.. పుతిన్కు కోపం రాదా?
రష్యాతో ఇండియాది ఈ నాటి బంధం కాదు.. సోషలిజం అంటే మక్కువ చూపే మన భారత నిర్మాత, మొదటి ప్రధాని నెహ్రూ.. రష్యాను చాలా అభిమానించేవారు.. అలా తొలితరం నుంచే ఇండియాకు రష్యాతో స్నేహం కుదిరింది. అప్పటి నుంచి ఇండియాకు రష్యా నమ్మకమైన స్నేహితుడు. అనేక రంగాల్లో రష్యా ఇండియాకు సాయం చేసింది. రష్యా సహకారంతోనే ఇండియా పారిశ్రామికంగానూ ఎదిగింది. అయితే ఎంత స్నేహితుడు అయినా తప్పు చేస్తున్నప్పుడు తప్పు అని చెప్పగలగాలి. కానీ అలా చెబితే ఇండియాకు నష్టం.. అందుకే ఇండియా ఓటింగ్కు దూరంగా ఉండిపోయింది.
కానీ తాజాగా ఇండియా ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ నేతృత్వంలో ఇవాళ ఉన్నత స్థాయి సమావేశాలు మూడు, నాలుగు జరిగాయి. ఇంత తక్కువ సమయంలో ఇలా మోడీ సమావేశాలు నిర్వహించడం చాలా అరుదు. రష్యా - ఉక్రెయిన్ యుద్ధ వాతావరణం నేపథ్యంలో ఈ భేటీలు కీలకంగా మారాయి. ఈ భేటీల్లో ప్రధానంగా భారతీయులను స్వదేశానికి తీసుకురావడంపై చర్చించారు. అంతే కాదు.. ఉక్రెయిన్ చుట్టుపక్కల దేశాలకు నలుగురు కేంద్ర మంత్రులను పంపాలని నిర్ణయించారు.
అయితే ఈ భేటీల్లో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే.. ఉక్రెయిన్ కు మానవతా దృక్పధంతో సహకారం అందించాలని మోదీ నిర్ణయించారు. రష్యా దాడుల్లో గాయపడుతున్న ఉక్రెయిన్ వాసుల కోసం మందులు, ఇతర సహాయక సామాగ్రి పంపాలని ఇండియా నిర్ణయించినట్టు తెలుస్తోంది. మరి ఇలా చేస్తే పుతిన్ కు కోపం రాదా.. ఏమో.. మోదీ ఎలా మేనేజ్ చేస్తారో.. చూడాలి.