
ఏపీలో విద్యుత్ కష్టాలు మటు మాయం... త్వరలోనే?
గత ఆరు నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ కష్టాలు ఏ విధంగా ఉన్నాయి అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీనికి కారణం కరెంట్ వినియోగం ఎక్కువ కావడం మరియు కరెంట్ ఉత్పత్తి తక్కువ కావడమే అని స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఈ సమస్యను పరిష్కరించడానికి ఏపీ ప్రభుత్వం నుండి ఎంపి విజయ సాయి రెడ్డి ఒక ప్రకటన చేశాడు. త్వరలోనే శ్రీకాకుళం జిల్లాలో 6 అణు విద్యుత్ రియాక్టర్ లను నిర్మించడానికి ప్రణాళిక ను సిద్దం చేస్తున్నామని తెలిపారు. పార్లమెంట్ లో కేంద్ర శాస్త్ర సాంకేతిక విజ్ఞాన శాఖ సహాయ మంత్రి జితేంద్ర సింగ్ విజయ్ సాయి రెడ్డి అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా ఈ ప్రతిపాదనకు అనుమతి ఇచ్చినట్లు ప్రకటనలో తెలిపారు.
ఇక్కడ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ ఒక్కో అణు రియాక్టర్ 1208 మెగా వాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేయగల సామర్థ్యం కలిగి ఉన్నట్లు తెలిపారు. అయితే ఈ రియాక్టర్ లు మన దేశంలో తయారు కాకపోయినా బాగా పని చేస్తాయని పేర్కొన్నారు. దీనిని బట్టి చూస్తే రానున్న కొద్ది రోజుల్లో రాష్ట్రం విద్యుత్ కష్టాల నుండి బయటపడుతుంది అని తెలుస్తోంది.