ప్రకృతి వైపరీత్యాలు అనేవి ఎప్పుడు ఏ విధంగా ఎలా సంభవిస్తాయో చెప్పడం అనేది చాలా కష్టమైన పని అని చెప్పవచ్చు. వర్షాలు, వర దలు భూకంపాలు ఈ ప్రకృతిలో సంభవించే ప్రధాన విపత్తులు. వీటిని ఆపడం అనేది ఎవరి వల్ల కాని పని, ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు చాలా వరకు ఆస్తి నష్టం ప్రాణ నష్టం కూడా జరుగుతుంది. టెక్నాలజీ పెరిగిన కాలంలో రాబోయే అటువంటి ప్రకృతి వైపరీత్యాలను మనం కొంత వరకు తెలుసుకోగలుగుతాం.
అది తుఫాన్లు, భూకంపాలు ఇలాంటివి. కానీ అది ఏ విధమైన ప్రమాదాన్ని కలిగి స్తాయో మొత్తంగా మాత్రం చెప్పలేం. కానీ ప్రస్తుత టెక్నాలజీ ద్వారా కొంతవరకు మెరుగు పడ్డామని చెప్పవచ్చు. ఆఫ్ఘనిస్తాన్, తజికిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో భూకంపం సంభవించిన తరువాత ఢిల్లీ, JK ప్రాంతాలలో ప్రకంపనలు వచ్చాయి. ఢిల్లీ ఎన్సీఆర్, జమ్మూ కాశ్మీర్లోని కొన్ని ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. ఆఫ్ఘనిస్తాన్ తజికిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో శనివారం ఉదయం 9.45 గంటలకు 181 కిలోమీటర్ల లోతులో 5.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇది జమ్మూ కాశ్మీర్ మరియు ఢిల్లీ ఎన్సిఆర్లోని కొన్ని ప్రాంతాలలో ప్రకంపనలు సృష్టించింది.
ఆఫ్ఘనిస్తాన్-తజికిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో శనివారం ఉదయం 9.45 గంటలకు 181 కిలోమీటర్ల లోతులో 5.7 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇది జమ్మూ కాశ్మీర్ మరియు ఢిల్లీ ఎన్సిఆర్లోని కొన్ని ప్రాంతాలలో ప్రకంపనలు సృష్టించింది. ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్కు ఈశాన్యంగా 259 కి.మీ, తజికిస్థాన్లోని దుషాన్బేకు ఆగ్నేయంగా 317 కి.మీ, పాకిస్థాన్లోని ఇస్లామాబాద్కు వాయువ్యంగా 346 కి.మీ, గుల్మార్గ్కు వాయువ్యంగా 395 కి.మీ, జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్కు వాయువ్యంగా 422 కి.మీ దూరంలో భూకంపం సంభవించినట్లు సమాచారం. ఈ భూప్రకంపనల్లో ఎంత నష్టం జరిగింది అనేది ఇప్పటికీ తెలియరాలేదు. దీనిపై సరిహద్దు ప్రాంతాల అధికారులు అక్కడి ప్రజలను అప్రమత్తం చేసి నట్టు సమాచారం.