హ్యాపీ న్యూ ఇయర్: ఒమిక్రాన్ తో జాగ్రత్త...

VAMSI
దేశంలో నిన్న అర్దరాత్రి నుండే న్యూ ఇయర్ వేడుకలు మొదలయ్యాయి. గల్లీ నుండి ఢిల్లీ వరకు కొత్త సంవత్సర సంబరాలు జోరు అందుకున్నాయి. అయితే ఒమిక్రాన్ కారణంగా చాలా మంది ఇళ్ళ నుండి బయటకు రావడం లేదు. కానీ ఎక్కువ మంది మాత్రం వైరస్ మాట పక్కన పెట్టి న్యూ ఇయర్ ని ఎప్పటి లాగే స్వేచ్చగా, సంతోషంగా ఎంజాయ్ చేస్తున్నారు. పాత సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెబుతూ గ్రాండ్‌గా పార్టీలు చేసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఎక్కడ కూడా తగ్గేదేలే అన్నట్లు జోష్‌ కనబతోంది.

పసందైన పాటలతో హుషారైన స్టెప్పులతో దేశ సైనికులు న్యూ ఇయర్ కి స్వాగతం పలికారు. చేదు జ్ఞాపకాలు, చెడు అనుభవాలు మిగిల్చిన 2021 సంవత్సరానికి గుడ్ బాయ్ చెబుతూ వచ్చిన నూతన సంవత్సరంలో ప్రజలందరికీ మంచే జరగాలని కోటి ఆశలుతో 2022 నూతన సంవత్సరానికి ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారు. ఇక ఒమిక్రాన్ నేపథ్యంలో నూతన సంవత్సర వేడుకల విషయానికి వస్తే ప్రస్తుతం దేశంలో వైరస్ వ్యాప్తి ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. అయితే రానున్న రోజుల్లో పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో అన్న సందేహంతో ఉన్నా ఈ సంతోషమైన రోజును ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు.

కొంత మంది మాత్రం కరోనా కొత్త వేరియంట్ భయంతో ఇంటి నుండి కనీసం బయటకు కూడా రాలేదు. గతంలో న్యూ ఇయర్ వేడుకల కంటే ఈ సారి కరోనా నేపథ్యంలో న్యూ ఇయర్ సందడి తక్కువనే చెప్పాలి. ఇంకా రెండు నెలల వరకు ఒమిక్రాన్ భయం ఉండనుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ గత రెండు సంవత్సరాలలో కరోనా కారణంగా జరిగిన నష్టాన్ని తలుచుకుని ప్రవర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ కొత్త సంవత్సరంలో కరోనా మనల్ని వీడి వెళ్లిపోవాలని కోరుకుందాం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: