గుడ్ న్యూస్ : వారి ఖాతాల్లోకి రూ.703కోట్లు..!

NAGARJUNA NAKKA
అర్హత ఉన్నా ఏదైనా కారణంతో వివిధ సంక్షేమ పథకాల్లో లబ్ది పొందని వారికి ఏపీ ప్రభుత్వం తీపి కబురు అందించింది. 9లక్షల 30వేల 809మంది ఖాతాల్లో దాదాపు 703కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి జగన్ నేడు జమ చేయనున్నారు. అర్హత ఉండి ఏ కారణంతోనైనా సంక్షేమ పథకాలకు అనర్హులుగా మారితే.. వారు ఈ పథకాన్ని అమలు చేసిన నెలలోగా గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే పరిశీలించి లబ్ధి అందిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. వారందరికీ ఏటా జూన్, డిసెంబర్ నెలలో నగదు అందిస్తామని వెల్లడించింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయం నుంచి లబ్ధిదారుల ఖాతాల్లో సీఎం జగన్ నగదు జమ చేయనున్నారు. ఏదైనా కారణం చేత సంక్షేమ పథకాలు అందని వారికి ఏటా జూన్, డిసెంబర్ లో లబ్ధి చేకూరుస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.

మరోవైపు ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీలకు ప్రోత్సాహకాల కింద ప్రభుత్వం 134కోట్ల రూపాయలను విడుదల చేసింది. ఈ నిధులను జిల్లాల వారీగా కేటాయించారు. ఏకగ్రీవమైన 2వేల 199 గ్రామాల పంచాయతీలకు ఈ నిధులు అందనున్నాయి. ఏకగ్రీవాల్లో 2వేల వరకు జనాభా కలిగిన పంచాయతీలకు 5లక్షల రూపాయలు, 2వేల నుంచి 5వేల లోపు జనాభా కలిగిన పంచాయతీలకు 10లక్షల రూపాయలు, 5వేల నుంచి 10వేల లోపు జనాభా ఉన్న పంచాయతీలకు 15లక్షల రూపాయలు, 10వేల కంటే మించి జనాభా కలిగిన పంచాయతీలకు 20లక్షల రూపాయలు కేటాయించారు.

ఇక కరోనా, ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా అధికారులతో సమీక్ష చేపట్టిన సీఎం జగన్.. వైద్యశాఖలో ఉద్యోగాల భర్తీపై కీలక ఆదేశాలు జారీ చేశారు. ఫిబ్రవరి నాటికి ఆస్పత్రుల్లో పూర్తిస్థాయి సిబ్బంది అందుబాటులో ఉండాలన్న ఆయన.. అదే సమయానికి కొత్త నియామకాలు పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే వైద్యఆరోగ్య శాఖలో సాధారణ బదిలీలకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.





 




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: